అలసట మనకే.. వైరస్కు కాదు: కేంద్రం
దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా నమోదువుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. ....
నిర్లక్ష్యంగా ఉండొద్దు.. అనవసర భయం వద్దు
దిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా నమోదువుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అలసట మనకే తప్ప వైరస్కు కాదన్న విషయాన్ని దేశ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను పాటించాలని కోరారు. గత నాలుగు వారాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, యూపీ, దిల్లీ, తమిళనాడు, పంజాబ్లలో మరణాలు పెరుగుతున్నాయని వివరించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి రోజువారీ కేసులు పెరుగుతూ ఆరోగ్య వ్యవస్థపై భారాన్ని మోపాయన్నారు. గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉందని, రాజస్థాన్, యూపీలలో 5రెట్లు వైరస్ ఉద్ధృతి పెరగ్గా.. ఛత్తీస్గఢ్ 4.5 రెట్లు, దిల్లీలో 3.3రెట్లు పెరిగినట్టు తెలిపారు.
ఆ ప్రవర్తన వల్లే కరోనా ఉద్ధృతి!
కరోనా ఓ స్కామ్.. ప్రాణాలకు ఏమీ కాదు.. నాకు మాస్క్ అవసరం లేదనే ప్రవర్తన వల్లే దేశంలో కేసులు భారీగా పెరుగుతున్నాయని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. అనవసరమైన భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు. మాస్క్ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా రికవరీ అయ్యే వరకు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. అనవసర ఆందోళన మరిన్ని క్లిష్ట పరిస్థితులకు కారణమవుతుందని తెలిపారు. కరోనా గొలుసును ఛేదించడంలో అందరూ భాగస్వాములుకావాలని విజ్ఞప్తి చేశారు.
భయం నుంచి బయటపడండి
భయం వాతావరణం నుంచి బయటపడాలని లవ్ అగర్వాల్ కోరారు. ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులు తమ కుటుంబ సభ్యులతో ఆడియో, వీడియో కాల్లో మాట్లాడేలా సదుపాయం ఉండేలా చూడాలన్నారు.అలాగే, వారితో పాటు అటెండర్లు ఉంటే మాట్లాడుకొనే వీలు కల్పించాలని సూచించారు. కంటెయిన్మెంట్, సర్వైలెన్స్ వ్యూహాలను పటిష్టంగా అమలుపరచాలన్నారు.
ఆక్సిజన్ సరఫరాపై 24*7 కంట్రోల్ రూమ్
దేశంలో సరిపడా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్టు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రాలకు కేటాయించే అంశంపై రోజువారీ సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు వీలుగా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొనేందుకు 24*7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. భారతీయ రైల్వే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థలు ఆక్సిజన్ సజావుగా సరఫరా జరిగేలా దోహదం చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాతలకు 8,593 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ను కేటాయించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొవిడ్ రోగులకు కొన్ని సూచనలు
* కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేట్ అవ్వండి. వెలుతురు ఎక్కువగా ఉండే గదిలో ఉండండి.
* ట్రిపుల్ లేయర్ మాస్క్ ధరించండి. ఎనిమిది గంటలకు ఓసారి దాన్నిమార్చేయండి.
* మీ సంరక్షణ చూసేవారు గదిలోకి వచ్చే సమయంలో ఇద్దరూ ఎన్ 95 మాస్క్ ధరించాలి.
* తగిన విశ్రాంతి అవసరం. శరీరానికి తగినంత నీరు అందేలా జాగ్రత్త వహించండి
* తరచూ చేతులు కడుక్కోండి. పరిశుభ్రత పాటించండి.
* మీ వస్తువులను ఇంట్లో ఎవరితోనూ పంచుకోవద్దు.
* గదిలో మీరు తాకిన ప్రదేశాలను శుభ్రం చేసుకోండి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి.
* ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలు చెక్ చేసుకోండి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఎలా ఉందో చూసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి