Vice President: ప్ర‌కృతితో మ‌మేక‌మ‌వ్వాలి: వెంక‌య్య‌నాయుడు

ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో మ‌నిషి ప్ర‌కృతితో మ‌మేక‌మై జీవించ‌డం అవ‌స‌ర‌మ‌ని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు.

Published : 05 Jun 2021 11:23 IST

దిల్లీ: ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో మ‌నిషి ప్ర‌కృతితో మ‌మేక‌మై జీవించ‌డం అవ‌స‌ర‌మ‌ని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని చెప్పారు. సుస్థిర వ్యవ‌సాయ విధానాల‌ను అమ‌లు చేయాల‌ని రైతుల‌కు సూచించారు. అట‌వీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హించి స‌ముద్ర కాలుష్యాన్ని అరిక‌ట్టాల‌న్నారు. క‌ర్భ‌న ఉద్గారాల‌ను త‌గ్గించ‌డంపై అంద‌రూ దృష్టి పెట్టాల‌ని వెంక‌య్య‌నాయుడు వివ‌రించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని