రాహులే పగ్గాలు చేపట్టాలి
కాంగ్రెస్ పార్టీలో పాత-కొత్త నేతల మధ్య ఎలాంటి పోరూ లేదని సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ స్పష్టం చేశారు.
పాత-కొత్త నేతల మధ్య కలహమేమీ లేదు
యువతకు ఎప్పటినుంచో కాంగ్రెస్లో ప్రాధాన్యం
‘ఈటీవీ భారత్’తో హరీశ్ రావత్
కాంగ్రెస్ పార్టీలో పాత-కొత్త నేతల మధ్య ఎలాంటి పోరూ లేదని సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ స్పష్టం చేశారు. యువ నేతల్ని ప్రోత్సహించిన అనేక దాఖలాలు పార్టీ చరిత్రలో కనిపిస్తాయని, అది ఇందిరాగాంధీ హయాం నుంచి కొనసాగుతూ వస్తోందని చెప్పారు. తనతోపాటు కమల్నాథ్, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్శర్మ, ముకుల్ వాస్నిక్ వంటి అనేకమంది యువకులుగానే కాంగ్రెస్ పార్టీలో చేరామని గుర్తు చేశారు. అందువల్ల పాత, కొత్త నేతల మధ్య సమరమేమీ లేదన్నారు. ‘ఈటీవీ భారత్’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం విషయంలో కొందరు నేతలు లేఖ రాయడంపై ఎవరికీ అభ్యంతరం లేదని, దానికి ఎంచుకున్న సమయం, పాటించిన విధానమే అధిష్ఠానానికి నచ్చలేదని రావత్ చెప్పారు. ఆజాద్, అహ్మద్ పటేల్ వంటి నేతలకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. రాహుల్గాంధీ నాయకత్వంపై కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రధాని నరేంద్రమోదీ తీరును ఆయన దీటుగా ఎండగడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పర్యటించి, అవగాహన తెచ్చుకున్న యువనేతగా రాహులే పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని రావత్ అభిప్రాయపడ్డారు. అంతర్గత ఎన్నికలు అవసరమేనని, దానికి తగిన సమయం రావాలని చెప్పారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ వద్ద ఉందన్నారు.
మిన్ను విరిగి మీద పడిపోదు: ఖుర్షీద్
దిల్లీ: అత్యవసరంగా పార్టీ సారథిని ఎన్నుకున్నంత మాత్రాన మిన్ను విరిగి మీద పడిపోదని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఆదివారం పీటీఐ వార్తాసంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అధిష్ఠానానికి లేఖ రాసినవారు ఒకవేళ దానిపై తనను సంతకం చేయాలని అడిగినా చేసి ఉండేవాడిని కాదని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసే బదులు ఆమెతో నేరుగానే మాట్లాడి ఉంటే బాగుండేదని, వారికి ఆ అవకాశం ఎప్పుడూ ఉందని అభిప్రాయపడ్డారు. తగిన సమయంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నవారు ఆ విషయాన్ని ఆయనకే వదిలిపెట్టడం మంచిదన్నారు.
బాహాటంగా వ్యాఖ్యలు సబబు కాదు: కాంగ్రెస్
కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై పార్టీ నేతలెవరూ బాహాటంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటీవల సీడబ్ల్యూసీలో ఈ మేరకు చెప్పిన విషయాన్ని నేతలంతా గుర్తు పెట్టుకోవాలని, కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్