‘ఎంపీలమని చెప్పినా పోలీసులు మాపై దాడి చేశారు!’
: తాము ఎంపీలమని చెప్పినా కూడా వినకుండా దిల్లీ పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేరళకు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ .....
పార్లమెంట్లో లేవనెత్తిన యూడీఎఫ్ ఎంపీలు
దిల్లీ: తాము ఎంపీలమని చెప్పినా కూడా వినకుండా దిల్లీ పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేరళకు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఎంపీలు ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు. కేరళలో ప్రతిపాదిత సెమీ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా నినాదాలు చేసుకుంటూ పార్లమెంట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. అయితే, ఎంపీల ఆరోపణల్ని దిల్లీ పోలీసులు ఖండించారు. ఏ ఎంపీపైనా తాము దాడి చేయలేదని స్పష్టంచేశారు.
అసలేం జరిగిందంటే?
లోక్సభలో ప్రశ్నోత్తరాల అనంతరం ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కె.సురేశ్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా ఎంపీలతో పాటు మొత్తం 12 మంది సభ్యులు ఉదయం 10.45గంటల సమయంలో విజయా చౌక్ నుంచి బయల్దేరి పార్లమెంట్కు నిరసన ర్యాలీగా వస్తుంటే దిల్లీ పోలీసులు అక్కడికి వచ్చి తమను అడ్డుకున్నారన్నారు. తాము ఎంపీలమని చెబితే.. నినాదాలు చేయడంపై వారు అభ్యంతరం తెలిపారన్నారు. నినాదాలు చేయడం తమ హక్కు అని చెప్పగా.. ఎలాంటి కవ్వింపులకు పాల్పడకపోయినా తమపై దాడి చేశారని ఓం బిర్లాకు వివరించారు. సిల్వర్లైన్ ప్రాజెక్ట్ కారిడార్ సరిహద్దు సర్వే, మార్కింగ్పై కేరళలోని లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వం తీవ్ర నిరసనలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ ప్రాజెక్టు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం కేరళ సీఎం పినరయి విజయన్ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.
దిల్లీ పోలీసులకున్న అధికారమేంటి?: ఆరెస్పీ ఎంపీ
ఈ ఘటన దురదృష్టకరమని ఆరెస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్చంద్రన్ పేర్కొన్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారంతా ఎంపీలేనని పోలీసులకు బాగా తెలిసినా పార్లమెంట్ భవనంలోకి అనుమతించలేదని ఆరోపించారు. ఇది తమ ప్రత్యేక హక్కుకు సంబంధించిన ప్రశ్న అన్నారు. పార్లమెంట్ ఆవరణలోకి వచ్చాక కూడా తమను అడ్డుకున్నారన్నారు. పార్లమెంటులో ప్రవేశించకుండా ఎంపీలను బలవంతంగా నియంత్రించేందుకు దిల్లీ పోలీసులకు ఉన్న అధికారమేంటని ప్రశ్నించారు. సభ్యులు చెప్పిన విషయాల్ని ఆలకించిన స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని యూడీఎఫ్ ఎంపీలకు సూచించారు.
రాజ్యసభలోనూ లేవనెత్తారు!
మరోవైపు, ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ రాజ్యసభలో లేవనెత్తారు. ఎంపీలు తమ శాంతియుత నిరసన తర్వాత పార్లమెంట్కు వస్తుంటే దిల్లీ పోలీసులు అడ్డుకొని, అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. దీనిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీకు సూచించారు. హోంమంత్రిత్వశాఖతో మాట్లాడి విషయం తెలుసుకుంటానన్నారు.
పోలీసుల వివరణ ఇదీ..
ఈ ఘటనపై దిల్లీ పోలీసుల పౌర సంబంధాల అధికారి సుమన్ నాల్వా మాట్లాడారు. ‘‘కొంతమంది వ్యక్తులు మలయాళంలో నినాదాలు చేస్తూ మీడియా లాన్ నుంచి నార్త్ ఫౌంటెన్ బారికేడ్ పాయింట్ వద్దకు వచ్చారు. బారికేడ్ల వద్ద సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అయితే, తాము ఎంపీలమంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఐడీలను చూపించాలని అడగ్గా తిరస్కరించారు. దీంతో వారిని గుర్తించేందుకు వీలుగా పార్లమెంట్లోని గేట్ నంబర్ 1 వద్ద సెక్యూరిటీ పికెట్ నుంచి సిబ్బందిని పిలిపించారు. వాళ్లు వచ్చి ఎంపీలను గుర్తించగా.. లోపలికి అనుమతించాం. ఏ ఎంపీపైనా దౌర్జన్యం చేయలేదు. బారికేడ్ల వద్ద ఉన్న సిబ్బంది వారిని అడ్డుకొనేందుకు మాత్రమే ప్రయత్నించారు. ఎంపీలు తమ గుర్తింపును పేర్కొనకుండా నినాదాలు చేస్తూ ముందుకు వస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్