Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
రానున్న రోజుల్లోనూ మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం అందేలా చూడాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. దేశాభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడే మీడియా మిత్రులను ఆమె ప్రశంసించారు.
‘ఇండియా టుడే క్లాన్కేవ్ ఈస్ట్-2022’లో పాలొన్న దీదీ
దిల్లీ: రానున్న రోజుల్లోనూ మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం అందేలా చూడాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. దేశాభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడే మీడియా మిత్రులను ఆమె ప్రశంసించారు. ‘ఇండియా టుడే క్లాన్కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమంలో ఆమె సోమవారం పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపాపై ఆమె పలు విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, భాజపా నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ, హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ ప్రధాన కార్యదర్శి కావడం గురించి ఆమె ఈ కార్యక్రమంలో చర్చించారు. 2024లో జరిగే ఎన్నికలు పాలకులను ఎన్నుకొనేందుకు కాకుండా భాజపాను తిరస్కరించేందుకు జరుగుతాయన్నారు. ‘‘దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో భాజపాను బుల్డోజ్ చేస్తారు. ఎన్నుకునేందుకు కాదు.. భాజపాకు వ్యతిరేకంగా పార్టీ నేతలని తిరస్కరించేందుకే ప్రజలు ఓటు వేస్తారు’’ అని దీదీ అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
మహారాష్ట్రలో (Maharashtra) ఏర్పడిన కొత్త అధికార కూటమి ఆరు నెలల్లో కూలిపోతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యల తరహాలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ శిందే-దేవేంద్ర ఫడణవీస్ సారథ్యంలోని కూటమి త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని నేను భావించడంలేదు. ఇది అనైతిక, అప్రజాస్వామిక సర్కారు. వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండవచ్చు, కానీ ప్రజల హృదయాలను గెలవలేరు’ అని పేర్కొన్నారు.
‘మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చు, కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగించి మిమ్మల్ని కిందకు దింపుతారు’ అని ఆమె అన్నారు. భాజపా తరచూ ఖండిస్తూ వస్తున్న వారసత్వ రాజకీయాలపైనా దీదీ స్పందించారు. ‘భాజపా దేన్ని వారసత్వ రాజకీయం అంటోంది? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ మరణం తర్వాత ఆయన కుమార్తె షేక్ హసీనా ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె కాకుండా ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు?’ అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రస్థానంపైనా మమత మాట్లాడారు. ‘అతడు రాజకీయాల్లో ఉండటం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? ప్రజలు రెండుసార్లు అతడ్ని ఎన్నుకున్నారు. యువత దేశ బాధ్యతలను చేపట్టాలని మీకు లేదా?’ అని అన్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలంటున్న భాజపా.. మరెందుకు హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి కట్టబెట్టిందని విమర్శలు గుప్పించారు. ఈ వారసత్వ పదవి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారని, అయితే అవి భాజపాకు వ్యతిరేకంగా వేస్తారని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో దీదీ పాట కూడా పాడారు. తొలుత పాడటానికి సంకోచించిన ఆమె.. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిన ‘ఏ మేరే వతన్ కే లోగో’ అనే ప్రసిద్ధ పాటను ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ
పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది. -
సత్పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల సత్పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. -
11న 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. -
దుష్యంత్ దవే లేఖపై ఎస్సీబీఏ అధ్యక్షుడి దిగ్భ్రాంతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బహిరంగ లేఖ రాయడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు ఆదిశ్ సి అగ్రవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మోదీ చిత్రంతో విద్యార్థుల సెల్ఫీలు తప్పనిసరేమీ కాదు
ప్రధాని మోదీ చిత్రంతో విద్యార్థులు సెల్ఫీ దిగేందుకు వీలుగా కళాశాలల్లో ఒక సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్థించుకున్నారు. -
యాజమాన్య విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. -
తనపై వీడియో క్లిప్ రావడంపై ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ ఆవేదన
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గురువారం రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభివాదం చేసే సమయంలో ఆయన చేతులు జోడించి, శరీరాన్ని ముందుకు వంచిన భంగిమను పరిహసించే రీతిలో ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమంలో ప్రచారంలోకి వచ్చింది. -
ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ప్రధాన కార్యదర్శి పాటించాల్సిందే
దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
అమెరికా, కెనడా ఆరోపణలపై సమాన వైఖరి సాధ్యం కాదు
అమెరికాలో సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్రలో భారతీయుడి పాత్రపై ఆ దేశం చేసిన ఆరోపణలపై మన దేశం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ గురువారం పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్సభ ముందుకు రానుంది. -
తెలుగు సహా పది భాషల్లో కేశవానంద భారతి తీర్పు
‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు తెలుగు సహా పది భాషల్లోకి తర్జుమా చేసింది. -
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. -
తేజస్ కొనుగోలుకు 4 దేశాల ఆసక్తి
దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ను కొనుగోలు చేసేందుకు నైజీరియా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్టు ఆసక్తి... -
9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్సభ స్పీకర్ ఆమోదం
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 9 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ఆమోదించారు. -
కేరళ సీఎం, గవర్నర్ మధ్య మరోసారి మాటల యుద్ధం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. -
అర్జున్ ముండాకు వ్యవసాయశాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర మంత్రి పదవులకు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్సింగ్ పటేల్, రేణుకాసింగ్ సమర్పించిన రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదించారు. -
చైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు భారత్లో లేవు : కేంద్రం
ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా ఆర్నెల్ల కాలంలో దిల్లీలోని ఎయిమ్స్లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఖతార్లో మరణశిక్ష పడిన బాధితులతో భారత రాయబారి భేటీ
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్లోని భారత రాయబారి కలిశారు. -
మెఫ్తాల్ వినియోగంతో దుష్ప్రభావాల ముప్పు!
కీళ్లవాతం, నెలసరి నొప్పిని తప్పించుకునేందుకు ప్రజలు అధికంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధం కొన్ని దుష్ప్రభావాలకూ కారణమయ్యే ముప్పు లేకపోలేదని భారత ఔషధప్రబంధ కమిషన్ (ఐపీసీ) హెచ్చరించింది!


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య