china: చైనా దీర్ఘకాలిక యుద్ధ సన్నద్ధత..!
భారత్, తైవాన్లే లక్ష్యంగా డ్రాగన్ దీర్ఘకాలిక యుద్ధసన్నాహాలు చేస్తోంది. భారత్ వైపు దాదాపు 3 వేల కిలోమీటర్లు పైనున్న వాస్తవాధీన రేఖ వెంబటి
* ఒక్క ఏడాదిలో 250 క్షిపణి పరీక్షలు
* అమెరికా రక్షణ శాఖ నివేదిక సారాంశమిదే..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్, తైవాన్లే లక్ష్యంగా డ్రాగన్ దీర్ఘకాలిక యుద్ధ సన్నాహాలు చేస్తోంది. భారత్ వైపు దాదాపు 3 వేల కిలోమీటర్ల పైనున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలకు ప్రయత్నిస్తూ కవ్విస్తుండగా.. మరోవైపు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి డజన్ల కొద్దీ విమానాలను పంపిస్తోంది. ఈ చర్యల వెనుక చైనా దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ ‘చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ 2021’ నివేదికను విడుదల చేసింది. దీనిలో చైనా ఓ ఆయుధ భూతంలా ఎలా పెరుగుతోంది.. వాస్తవాధీన రేఖ, తైవాన్లతో ఎలా వ్యవహరించనుందనే విషయాలను ప్రస్తావించారు.
అణ్వాయుధాలు.. రాకెట్ ఫోర్స్పై దృష్టి..!
సాంప్రదాయ సైనిక దళాలను తగ్గించుకొంటున్న చైనా.. వాస్తవానికి కొన్నేళ్ల నుంచి క్రమంగా రక్షణ బడ్జెట్ను పెంచుకొంటూ వస్తోంది. అణ్వాయుధాలు, రాకెట్ ఫోర్స్పై ఎక్కువగా దృష్టి సారించినట్లు అమెరికా నివేదిక పేర్కొంది. 2020 ఒక్క సంవత్సరమే డ్రాగన్ ప్రయోగాలు, శిక్షణ కోసం 250 బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాల్లో జరిగిన పరీక్షల సంఖ్య కంటే ఇది ఎక్కువ. వీటిల్లో నాలుగు క్షిపణులను దక్షిణ చైనా సముద్రంలోకి ప్రయోగించడం వివాదాస్పదమైంది. అంతేకాదు.. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే ఫోబ్స్ తరహా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అంటే అంతరిక్షంలోకి వెళ్లిన క్షిపణి భూ భ్రమణాలు చేస్తూ.. ఎప్పుడైనా శత్రువుపై దాడి చేస్తుంది. డీఎఫ్17, డీఎఫ్27, డీఎఫ్41 వంటి క్షిపణులను చైనా ఇప్పటికే అభివృద్ధి చేసింది. 250 వరకు క్షిపణి బొరియల(సైలోస్)ను ఇప్పటికే నిర్మించినట్లు ఇటీవలే బహిర్గతమైంది.
సైన్యం శక్తిమంతం అయ్యేనాటికి 700 అణువార్ హెడ్లు సిద్ధం..!
అమెరికా అంచనా ప్రకారం చైనా 2030 నాటికి 1000 అణువార్ హెడ్లను తయారు చేయనుంది. ఈ క్రమంలో 2027 వచ్చేసరికి 700 అణువార్ హెడ్లను సిద్ధం చేస్తుంది. 2027 సంవత్సరానికి సైనిక పరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ సంవత్సరం నాటికి చైనాలో సైనిక ఆధునికీకరణ పూర్తికావాల్సి ఉంది. అంటే డ్రాగన్ దళాలు తైవాన్ ఆక్రమణకు దిగినా మరో దేశం జోక్యం చేసుకొనే సాహసం చేయకూడదన్నది లక్ష్యం.
దాడి సంకేతాలు అందగానే ప్రతిదాడి చేసేలా (లాంఛ్ ఆన్ వార్నింగ్) స్ట్రాటజీపై చైనా పనిచేసే అవకాశం ఉందని అమెరికా అంచనా వేసింది. ఇటువంటి వ్యవస్థపై ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా, సోవియట్ యూనియన్లు పనిచేశాయి. ప్రత్యర్థుల అణువార్హెడ్లు గాల్లో ఉండగానే.. సంకేతాల ఆధారంగా పసిగట్టి ప్రతిదాడి చేయడం దీని లక్ష్యం.
విదేశాల్లో సైనిక స్థావరాల విస్తరణ..
సైనిక శక్తి పెరిగే కొద్దీ చైనా విదేశాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని ప్రపంచంపై పట్టు బిగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే జబూటిలో అమెరికా స్థావరానికి సమీపంలో చైనా స్థావరం ఏర్పాటు చేసింది. దీంతోపాటు కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, కెన్యా,సీషెల్స్, టాంజానియా, అంగోలా,తజకిస్థాన్లను ఈ స్థావరాల కోసం పరిశీలిస్తోంది. వీటిల్లో అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సింగపూర్, ఇండోనేషయా వంటివి కూడా ఉండటం విశేషం.
ఓ పక్క కవ్విస్తూనే.. నింద మాత్రం భారత్పై..
వాస్తవాధీన రేఖ వెంట పలు చోట్ల చైనా సైన్యం ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్ భూభాగాల్లో చొరబాట్లను ఇందుకు ఆయుధంగా ఎంచుకొంది. వివాదాస్పద భూభాగాల్లో గ్రామాల నిర్మాణం, ఎల్ఏసీ వెంబడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ అంశాలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు భారత నిర్మాణాల కారణంగానే తాము చేపడుతున్నట్లు చైనా నిందిస్తోంది. భారత్ రెచ్చగొట్టే చర్యల కారణంగానే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలను ఎల్ఏసీ వద్దకు తరలించినట్లు సమర్థించుకుంటోంది. తన దృష్టిలో సరిహద్దుగా భావిస్తున్న ప్రదేశాల (వాస్తవానికి అవి భారత్వే) నుంచి భారత దళాలు వెనక్కి తగ్గే వరకు పీఎల్ఏ దళాలు కొనసాగుతాయని చైనా చెబుతోంది. భారత్ వైపు మౌలిక సదుపాయాల కల్పనను అడ్డుకోవడమే దీని ఉద్దేశం.
ఇక తైవాన్తో సంక్షోభం తలెత్తితే భారత్ వైపు ఉన్న సరిహద్దు కూడా కీలక పాత్ర పోషిస్తుందని చైనా భావిస్తోంది. అందుకే తొలుత భారత్ వైపు సరిహద్దుపై దృష్టిపెట్టింది. దీంతోపాటు టిబెట్ సంస్కృతి ఇప్పటి వరకు పూర్తి చైనీకరణ కాలేదన్న విషయం బీజింగ్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇవి కీలక సమయాల్లో సమస్యలను సృష్టించే ప్రమాదం ఉందని అంచనా వేసింది. భారత్-అమెరికా సంబంధాలు బలపడే కొద్దీ ఇబ్బందులు తప్పవని డ్రాగన్ భావిస్తున్నట్లు అమెరికా నివేదిక అంచనా వేసింది. ఇక తైవాన్ను ఆక్రమించే ముందు వీలైనంత వరకు ఆ దేశాన్ని దిగ్బంధించాలన్నది చైనా ఎత్తుగడగా అమెరికా నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ