Supreme Court: ఇందులో హక్కుల ఉల్లంఘనేముంది?: ఫైజల్ ‘అనర్హత’ పిటిషన్పై సుప్రీం
లోక్సభ సభ్యత్వా్న్ని రద్దు చేయడంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా లక్షద్వీప్ మాజీ ఎంపీ ఫైజల్ (Mohammed Faizal)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
దిల్లీ: తనపై అనర్హత (Disqualification) వేటును లోక్సభ సెక్రటేరియట్ తొలగించకపోవడంపై లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ (Mohammed Faizal) దాఖలు చేసిన పిటిషన్.. మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ముందుకొచ్చింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్ కె.ఎం. జోసఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం.. ఇందులో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేముందని ప్రశ్నించింది. పిటిషనర్ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది.
ఓ హత్యాయత్నం కేసులో ఫైజల్ (Mohammed Faizal)కు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో లోక్సభ సచివాలయం ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. దీనిపై ఫైజల్ సుప్రీంకోర్టు (SC)ను ఆశ్రయించారు. జైలు శిక్ష తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించినప్పటికీ తన సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఈ క్రమంలోనే ఫైజల్ (Mohammed Faizal) పిటిషన్ నేడు ధర్మాసనం ముందుకు రాగా.. కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితేనే ఆర్టికల్ 32 కింద వేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ కేసులో ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు గురైంది?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఫైజల్ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ‘తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే హక్కును తీసేసుకున్నారు’ అని సమాధానమిచ్చారు. దీంతో కోర్టు స్పందిస్తూ.. ‘అది ప్రాథమిక హక్కు ఉల్లంఘన అవుతుందా?’ అని మరో ప్రశ్న వేసింది. అయితే, జైలు శిక్షపై స్టే విధించినా.. అనర్హతను ఎత్తివేసేందుకు నిరాకరించడం ఏకపక్ష నిర్ణయమని, దీనిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఫైజల్ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
ఇక, ఈ పిటిషన్పై ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘‘జైలు శిక్షపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నందున.. నేరుగా ఇక్కడికే వచ్చాం’’ అని ఫైజల్ తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఈ వివరణ అనంతరం.. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడుతామని ధర్మాసనం వెల్లడించింది.
కాగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న తరుణంలో అలాంటి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు.. రాహుల్గాంధీ కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ సాగుతోంది. పరువు నష్టం కేసులో రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో అతడిపై లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే జైలుశిక్షపై రాహుల్ ఇంకా పై కోర్టుల్లో అప్పీల్ చేసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప