Vaccination: స్పెయిన్దే అగ్రస్థానం.. ఎలా సాధ్యమయిందంటే?
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా రకం వ్యాప్తి తీవ్రతతో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. అగ్రదేశం అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి.
మాడ్రిడ్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా రకం వ్యాప్తి తీవ్రతతో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. అగ్రదేశం అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరగకుండా కొన్ని దేశాలు లాక్డౌన్ ఆంక్షలు విధించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్, బ్రిటన్, యూఏఈ, రష్యా, బెహ్రెయిన్ తదితర దేశాలతో పాటు జర్మనీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా ఈ ప్రక్రియ జోరందుకుంది.
ముందంజలో స్పెయిన్
అన్ని దేశాలతో పోలిస్తే కొవిడ్ వ్యాక్సినేషన్ను పకడ్బందీగా చేస్తూ స్పెయిన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సుమారు 47 కోట్ల స్పెయిన్ జనాభాలో ఇప్పటివరకు 61 శాతం మందికి వ్యాక్సినేషన్ను పూర్తి చేసింది. అత్యధిక మందికి టీకాలు వేసిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగానూ స్పెయిన్ నిలిచింది. ఇప్పటివరకూ ఇటలీలో 57.8 శాతం, ఫ్రాన్స్లో 56 శాతం, జర్మనీలో 55.2 శాతం, అమెరికాలో 50.3 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఎలా సాధ్యమయిందంటే..?
వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం కావాలంటే ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న జనాభాకు తగ్గట్టు డోసులను కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. వీటన్నింటితోపాటు ముఖ్యంగా ప్రజల్లో నెలకొన్న అనవసరపు అనుమానాలను చెరిపేయాలి. వ్యాక్సిన్ విషయంలో వారికి విశ్వాసం కలిగించేలా అవగాహన కల్పించాలి. అదే తరహాలో స్పెయిన్ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజల్లో మంచి విశ్వాసాన్ని నెలకొల్పింది. తద్వారా ప్రజలే స్వతహాగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు. అందువల్లే స్పెయిన్లో వ్యాక్సినేషన్ పూర్తయిన వారి శాతం మిగతా దేశాలకంటే ఎక్కువగా ఉంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ తాజా అధ్యయనం ప్రకారం.. స్పెయిన్లో 79 శాతం మంది ప్రజలు కొవిడ్ -19 వ్యాక్సిన్ను విశ్వసించారని తన అధ్యయనంలో పేర్కొంది. అమెరికాలో 62 శాతం, ఫ్రాన్స్లో 56 శాతం, జపాన్లో 47 శాతం మంది మాత్రమే టీకాలను విశ్వసించారని తెలిపింది.
గతానుభవం నేర్పిన పాఠాల నుంచే..
1950 మధ్యలో తీవ్రంగా ప్రభావం చూపిన పోలియో వ్యాధికి అనేక దేశాలు వణికిపోయాయి. దీన్ని అరికట్టడానికి టీకాలు వేయడం ప్రారంభించాయి. కానీ, ఫ్రాంకో నేతృత్వంలోని అధికారులు దాదాపు ఒక దశాబ్దం పాటు టీకాలు వేయకుండా వేచి ఉన్నారు. దీంతో స్పెయిన్లో వేల మంది పిల్లలు పోలియో బారిన పడి వికలాంగులుగా మారారు. అనేక మరణాలు కూడా సంభవించాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి స్పెయిన్ ప్రభుత్వం గట్టి చర్యలే చేపట్టింది. వ్యాక్సిన్పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.