Omicron: ప్రమాదకర స్థాయికి ఒమిక్రాన్ ఆర్నాట్ విలువ..!
ఒమిక్రాన్ మెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది..! ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370కిపైగా కేసులను తేలాయి. ఇక తొలుత ఒమిక్రాన్ను కనుగొన్న
* దక్షిణాఫ్రికాలో కేసుల ఉద్ధృతికి కారణమిదే..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఒమిక్రాన్ మెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది..! ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370కిపైగా కేసులు తేలాయి. ఇక తొలుత ఒమిక్రాన్ను కనుగొన్న దక్షిణాఫ్రికాలో కీలకమైన సార్స్కోవ్-2 ఆర్నాట్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. భారత్లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించారు. వీరిలో ఒకరు డాక్టర్ కాగా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఐదురుగు కూడా తాజాగా కొవిడ్ పాజిటివ్గా తేలారు. వీరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో లేదో మాత్రం తేలలేదు.
దక్షిణాఫ్రికాలో కేసులు పెరిగాయి ఇలా..
దక్షిణాఫ్రికాలో నవంబర్ 16న కేవలం 136 కరోనా కేసులు వచ్చాయి. ఇక.. ఒమిక్రాన్ వేరియంట్ను కనుగొన్నట్లు నవంబర్ 24న ప్రకటించారు. నవంబర్ 26 నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 3,402కు పెరిగింది. అదే డిసెంబర్ 1 నాటికి 8,561కి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా 80శాతం కేసులు గౌటెంగ్ ప్రావిన్స్లోనే నమోదువుతున్నాయి.
గౌటెంగ్ ప్రావిన్స్లో ఆర్నాట్ విలువ 2గా ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) వెల్లడించినట్లు నేచర్ పత్రిక కథనం పేర్కొంది. ఆర్నాట్ విలువలో ఈ స్థాయి పెరుగుదలను కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో చూసినట్లు డర్బన్లోని క్వాజులా-నాటల్ విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల నిపుణుడు రిచర్డ్ లెస్సల్ వెల్లడించారు. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్నాట్గా పేర్కొంటారు. అదే సౌతాఫ్రికా మొత్తంగా చూస్తే ఆర్నాట్ విలువ 1.47గా ఉన్నట్లు మెడికల్ న్యూస్ టుడే వెల్లడించింది. అయితే ఆర్నాటు విలువ 1 దాటడం ఏమాత్రం సానుకూల పరిణామం కాదు.
మ్యూటేషన్లతోనే సమస్య..!
సెప్టెంబర్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఉన్న సమయంలోనే ఇక్కడ ఆర్నాట్ విలువ 1 కంటే తక్కువగా నమోదైంది. కానీ, డెల్టాతో పోలిస్తే ఇది 3 నుంచి 6 రెట్ల మందికి సోకుతోందని బెల్జియంలోని ది క్యాథలికే యూనివర్శటీ లివెన్ బయాలజిస్ట్ టామ్ వెన్సిలీర్ పేర్కొన్నారు. ‘వేగంగా వ్యాపించడం వైరస్కు అనుకూలిస్తుంది.. మనుషులకు కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత వేగంగా వ్యాప్తి చెందితే అంత వేగంగా కొత్త మ్యూటేషన్లు పుట్టుకొచ్చి పరిస్థితిని ఘోరంగా మారుస్తాయి. ఈ వేరియంట్ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్ సీక్వెన్సింగ్ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పీసీఆర్ పరీక్షలు మాత్రమే ఒమిక్రాన్ను కొద్దిమేర గుర్తించగలుగుతున్నట్లు నేచర్ పత్రిక కథనం వెల్లడించింది.
ఇమ్యూనిటీని తప్పించుకొంటుందా..?
దక్షిణాఫ్రికాలో నాలుగోవంతు మంది కొవిడ్ టీకాలు తీసుకొన్నారు. డెల్టా వేరియంట్ వ్యాపించిన సమయంలో పెద్దసంఖ్యలో ప్రజలు దీని బారిన పడ్డారు. కానీ, దక్షిణాఫ్రికాలో రీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు ఆ దేశ ఎన్ఐసీడీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణమం భవిష్యత్తులో ఇమ్యూనిటీని తప్పించుకొనే వేరియంట్లు తయారు కావడానికి దోహదం చేసే అవకాశం ఉందని స్విట్జర్లాండ్కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బెర్న్ ఎపిడమాలజిస్ట్ క్రిస్టియన్ ఆల్థస్ పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా, అమెరికాకు చెందిన నిపుణుల బృందాలు ఈ మ్యూటేషన్లు యాంటీబాడీలను ఎంతవరకు తప్పించుకోగలవు అనే అంశంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటీ..?
విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ వైరాలజిస్టు షబీర్ మది దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ పరీక్షలకు నేతృత్వం వహించారు. ఒమిక్రాన్ విషయంలో ఆయన ఓ అంశాన్ని గమనించారు. దక్షిణాఫ్రికాలో వినియోగించిన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకొన్న వారిలో బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లు వస్తునట్లు గుర్తించారు. కాకపోతే వ్యాక్సిన్లు ఎంత మేరకు రక్షణ ఇస్తున్నాయో పూర్తిగా తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. కాకపోతే బూస్టర్ డోస్ శరీరంలోని యాంటీబాడీలను పెంచి మరింత రక్షణను ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సార్స్కోవ్-2 సోకిన తర్వాత కోలుకొని టీకాలు తీసుకొన్న వారిలో యాంటీబాడీలు ఒమిక్రాన్పై ఆశావాహంగానే పనిచేస్తున్నట్లు రాక్ఫెల్లర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు.
అంటు వ్యాధులను కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు ఆర్నాట్ విలువను 1కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. దీని విలువ తగ్గిస్తే వ్యాధిపై పట్టు సాధించినట్లే. ఇది 1కంటే తక్కువగా ఉంటే.. వ్యాధి అదృశ్యమవుతుందని 2003లో వ్యాపించిన సార్స్ ఇన్ఫెక్షన్ ఘటన తెలియజేస్తోంది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ