Rajiv Gandhi: రాజీవ్ గాంధీ సాయాన్ని గుర్తుచేసుకొని వాజ్పేయీ కొనియాడిన వేళ
దివంగత భాజపా నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ.. రాజీవ్ గాంధీ దాతృత్వాన్ని కొనియాడిన ఓ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ పంచుకున్నారు........
దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేడు జరుపుకొంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఓ అరుదైన వీడియోను పంచుకున్నారు. దివంగత భాజపా నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ.. రాజీవ్ గాంధీ దాతృత్వాన్ని కొనియాడిన సందర్భం అది. తాను కిడ్నీ సమస్యతో బాధపడుతూ డబ్బులు లేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లేందుకు బాధపడుతున్న సమయంలో రాజీవ్ గాంధీ తన మంచి మనసును చాటుకున్నారని వాజ్పేయీ ఓ సందర్భంలో వెల్లడించారు.
కాగా అప్పటి వీడియోను జైరామ్ రమేశ్ నేడు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో వాజ్పేయీ ఏమని చెప్పుకొచ్చారంటే.. ‘నేను కిడ్నీ సమస్యలు ఎదుర్కొన్నాను. మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ విషయం ఎలాగోలా రాజీవ్ జీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నన్ను పిలిచి, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి బృందంలో నన్ను చేర్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేను ప్రతినిధి బృందంలో పూర్తిస్థాయి సభ్యుడినయ్యాను. అన్ని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఫలితంగా పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చాను’ అని రాజీవ్ గాంధీ దాతృత్వాన్ని వివరించారు.
వాజ్పేయీ జీవితం ఆధారంగా ఎన్.పి.ఉల్లేఖ్ రచించిన ‘ది అన్టోల్డ్ వాజ్పేయి’లోనూ రాజీవ్పై భాజపా నేత ప్రశంసలు కురిపించిన విషయాన్ని తెలియజేస్తూ జైరామ్ రమేశ్ మరో ట్వీట్ చేశారు. ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను షేర్ చేశారు. ‘రాజీవ్ గాంధీ కేవలం ప్రభావవంతమైన ప్రధాని మాత్రమే కాదు. ఆయన రాజకీయాల్లో అరుదైన వ్యక్తి. మంచి మనిషి. సున్నితమైన వ్యక్తి’ అని వాజ్పేయీ అందులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం