Operation Trident: పాక్ కొరివితో తలగోక్కున్న వేళ ..!
భారత్ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్ దేశాల పై ‘ఆపరేషన్ ఫోకస్’ పేరిట ఇజ్రాయెల్ యుద్ధ విమానలతో దాడిచేసి గెలవడాన్ని చూసి పాక్ ప్రేరణ పొందింది.
పీడకలగా మిగిలిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్ దేశాల పై ‘ఆపరేషన్ ఫోకస్’ పేరిట ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడిచేసి గెలవడాన్ని చూసిన పాక్ తాను కూడా అలానే భారత్ను ఓడించాలని కలలుగన్నది. అందుకోసం ప్రయత్నించే క్రమంలో కొరివితో తలగోక్కుంది. చివరికి ఏముంది అప్పుడే సర్వీసులో చేరిన భారత కొత్త నౌకలు కరాచీ నౌకాశ్రయాన్ని ధ్వంసం చేశాయి. ఆ దెబ్బ నుంచి యుద్ధంలో కోలుకోలేక పాక్ రెండు ముక్కలైంది. భారత నావికా దళం కరాచీపై చేపట్టిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’కు 50 ఏళ్లు నిన్నటితో పూర్తయ్యాయి..!
సోవియట్ హెచ్చరికను పెడచెవిన పెట్టి..!
1971 నవంబర్లో పాకిస్థాన్లో జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన సోవియట్ యూనియన్ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ కనుక భారత్పై దాడి చేస్తే అది దానికి ఆత్మహత్యా సదృశంగా మారుతుందని పేర్కొంది. పాక్ ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలో లాహోర్ సహా పలు ప్రాంతాల్లో భారత్పై దాడి చేయాలంటూ అతివాదులు ర్యాలీలు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 23న పాక్ అధ్యక్షుడు యాహ్యాఖాన్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ నిర్వహించిన ‘ఆపరేషన్ ఫోకస్’ వలే డిసెంబర్ 3వ తేదీన పాక్కు చెందిన 51 యుద్ధ విమానాలు మూడు దఫాలుగా భారత్లోని 11 వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై ముందస్తు దాడులు నిర్వహించాయి. దీనికి ‘ఆపరేషన్ ఛెంఘిజ్ఖాన్’ అని పేరుపెట్టారు. పాక్ విమానాలు ఆగ్రా వరకు వచ్చాయి. మరోవైపు పాక్ సైన్యం కశ్మీర్ వద్ద భీకరమైన షెల్లింగ్ మొదలుపెట్టింది. ఈ దాడుల సమయంలో భారత్ ప్రతిస్పందించి నాలుగు పాక్ విమానాలను కూల్చేసింది. ఆ రోజు సాయంత్రమే భారత ప్రధాని ఇందిరాగాంధీ యుద్ధ ప్రకటన చేశారు. ఆ రోజు రాత్రే భారత యుద్ధవిమానాలు పాక్లోని లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి.
మిసైల్ బోట్లతో దాడికి వ్యూహం..!
భారత్ నావికాదళం పాకిస్థాన్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. నాటి చీఫ్ అడ్మిరల్ నందకు కరాచీ పోర్టు నిర్మాణాలపై మంచి అవగాహన ఉంది. పాక్ వాయుసేన దాడి చేసిన మర్నాడే కరాచీపై దాడి చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా మిసైల్ బోట్లను ఇందుకు వాడాలనుకున్నారు. ఎందుకంటే అవి వేగంగా కదలడంతోపాటు.. ప్రమాదకరమైన నాలుగు స్టైక్స్ క్షిపణులను కలిగిఉంటాయి. అంతేకాదు వాటిలో ఎలక్ట్రానిక్ కౌంటర్మెజర్స్ కూడా అమర్చారు. డిసెంబర్ 4వ తేదీన రష్యా నుంచి కొత్తగా కొనుగోలు చేసిన విద్యుత్ శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ నిపట్, నిర్ఘాత్, వీర్లను సిద్ధం చేశారు. వీటికి అండగా అర్నాల శ్రేణికి చెందిన కార్వెట్లు కిల్తన్, కట్చాల్, ట్యాంకర్ నౌక పుష్పక్లు రంగంలోకి దిగాయి. దీనికి ‘ఆపరేషన్ ట్రైడెంట్’ అని కోడ్నేమ్ పెట్టారు. డిసెంబర్ 4వ తేదీ పగటి వేళ కరాచీకి 250 నాటికల్స్ మైళ్ల దూరానికి భారత మిసైల్ బోట్లు చేరుకొన్నాయి. పాక్ గగనతల గస్తీని తప్పించుకొనేందుకు రహస్యంగా సంచరించాయి. పాక్ వైమానిక దాడిని అడ్డుకొనేందుకు వీలుగా రాత్రి కరాచీపై దాడి చేయాలని నిర్ణయించాయి. రాత్రి వేళ మళ్లీ కరాచీ దిశగా భారత నౌకలు పయనించాయి.
ద్వారకా మీద దాడికి ప్రతీకారం..!
1965 భారత్-పాక్ యుద్ధ సమయంలో ‘పీఎన్ఎస్ ఖైబర్’ భారత్లోని ద్వారకాపై దాడి చేసింది. ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో ఈ నౌక తేలిగ్గా దొరికిపోయి ధ్వంసమైంది. భారత నౌకలు కరాచీకి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా.. ‘పీఎన్ఎస్ ఖైబర్’ వాటిని గుర్తించింది. వెంటనే భారత్కు చెందిన ఐఎన్ఎస్ నిర్ఘాత్ రాత్రి 10.45 సమయంలో తొలి స్టైక్స్ క్షిపణిని ఖైబర్పై ప్రయోగించింది. దీని దెబ్బకు ఖైబర్ బాయిలర్ రూమ్ ధ్వంసమైంది. అయినా అది నీటిపై కనిపించడంతో నిర్ఘాత్ రెండో క్షిపణిని ప్రయోగించి మరో బాయిలర్ రూమ్ను ధ్వంసం చేసింది. ఫలితంగా ఖైబర్ 222 మంది నావికులతో సహా మునిగిపోయింది.
మందుగుండు నౌకను ధ్వంసం చేసి..
పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం సైగాన్ నుంచి ముందుగుండు, ఆయుధాలను తీసుకెళుతున్న మర్చెంట్ నౌక ‘వీనస్ ఛాలెంజర్’ను భారత్ లక్ష్యంగా చేసుకొంది. ఐఎన్ఎస్ నిపట్ రెండు క్షిపణులను ప్రయోగించడంతో ఈ నౌక నీటమునిగింది. 1971 యుద్ధంలో పాక్కు ఇది చావుదెబ్బతో సమానం. ఇక మూడో లక్ష్యంగా పాకిస్థాన్కు చెందిన సీ-క్లాస్ డెస్ట్రాయర్ పీఎన్ఎస్ షాజహాన్ను భారత నౌకలు గుల్ల చేశాయి. ఈ యుద్ధం తర్వాత దానిని తుక్కుగా మార్చేశారంటే ఎంతగా దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు.
సమీపంలోని పాక్ మైన్స్వీపర్ నౌక పీఎన్ఎస్ ముహ్ఫిజ్పై భారత నౌక వీర్ ఒక స్టైక్స్ క్షిపణిని ప్రయోగించింది. నిమిషాల్లో అది మునిగిపోయి 33 మంది పాక్ నావికాదళ సిబ్బంది మరణించారు.
మరోపక్క ఐఎన్ఎస్ నిపట్ కరాచీ రేవు దిశగా దూసుకుపోయింది. రేవుకు 14 నాటిక్ మైళ్ల దూరంలో ఆగింది. పాక్కు చెందిన కెమారీ వ్యూహాత్మక చమురు నిల్వలపై ఇది ఒక క్షిపణిని ప్రయోగించాక ఆపరేషన్ ముగించి భారత నౌకలు వెనక్కి మళ్లాయి. తమ మిషన్ విజయవంతమైందనడానికి గుర్తుగా భారత నావికాదళాధికారులు ‘అంగార్’ అనే కోడ్ను వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ కోహ్లికి పంపారు. వాస్తవానికి అదే రోజు భారత యద్ధవిమానాలు కూడా కరాచీలోని చమురు నిల్వలపై దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఏ దళం దాడి వల్ల ఆ చమురు నిల్వలు దెబ్బతిన్నాయన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్తో పాక్ వణికిపోయింది. ఆ కంగారులో ఏమి చేస్తున్నారో వారి సైనికాధికారులకే తెలియలేదు. పాక్కు చెందిన నిఘా విమానం డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున పీఎన్ఎస్ జుల్ఫీకర్ను భారత్కు చెందిన మిసైల్ బోట్గా భ్రమించి రిపోర్టును బేస్కు పంపింది. దీంతో పాక్ వాయుసేన దీనిని ధ్వంసం చేసేందుకు ఎఫ్-86 జెట్లను పంపింది. ఆ విమానాలు గుడ్డిగా పీఎన్ఎస్ జుల్ఫీకర్పై 900 రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పలువురు పాక్ నావికులు మృతి చెందారు. చివరకు అది పాక్కు చెందిన నౌకగా గుర్తించి దాడిని ఆపింది. ఈ వ్యవహారం మొత్తాన్ని భారత నావికాదళం రేడియో సిగ్నల్స్ సాయంతో మౌనంగా తెలుసుకొని నవ్వుకొంది. పాక్ వాయుసేనకు మిసైల్ బోట్కు- ఫ్రిగేట్కు కూడా తేడా తెలియకపోవడం వల్లే ఇది జరిగిందని తేల్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రశంసలు కురిపించింది. -
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
Chandrayaan: చంద్రుడి ఉపరితలంపై భారతీయుడు అడుగు పెట్టేవరకు భారత జాబిల్లి యాత్రలు కొనసాగుతాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. -
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. -
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ
తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. -
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. -
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!