Vaccination: అమెరికా జనాభాలో 50 శాతం మందికి పూర్తిస్థాయి టీకా!
అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్ వ్యాక్సిన్ అందిందని శ్వేతసౌధం గురువారం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేశారు....
వెల్లడించిన శ్వేతసౌధం
వాషింగ్టన్: అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్ వ్యాక్సిన్ అందిందని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో వ్యాక్సినేషన్ సమాచార విభాగానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సైరస్ షాపర్ ప్రకటించారు.
అర్హుల్లో 58.5 శాతం మందికి..
అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందికి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్ టీకాగానీ లేదా ఏక డోసు జాన్సన్ టీకా గానీ అందింది. నిజానికి అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి అంటే.. టీకా అందుబాటులోకి రాని 0-11 ఏళ్ల పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ టీకా తీసుకోవడానికి అర్హత గల వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 58.5 శాతం మందికి వ్యాక్సిన్ అందినట్లు సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మొత్తం జనాభాలో 58.4 శాతం అంటే 193 మిలియన్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందింది.
మధ్యలో నెమ్మదించిన వ్యాక్సినేషన్..
అధ్యక్షుడు జో బైడెన్ నిర్దేశించిన 70 శాతం మంది యువజనులకు కనీసం ఒక డోసు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నెల ఆలస్యమైంది. జులై 4 నాటికి ఈ మైలురాయిని చేరుకోవాలని బైడెన్ ఆదేశించారు. కానీ, మధ్యలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కాస్త నెమ్మదించడంతో లక్ష్య ఛేదనలో జాప్యం జరిగింది. ఏప్రిల్ మధ్యలో సగటున రోజుకు 3.3 మిలియన్ల డోసులు పంపిణీ చేశారు. అది ఓ దశలో 50 వేలకు పడిపోయింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లో 100 మిలియన్ డోసుల పంపిణీ లక్ష్యాన్ని బైడెన్ యంత్రాంగం సునాయాసంగా చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 2020, డిసెంబరు 14న ప్రారంభమైంది. సగం మందికి టీకా ఇవ్వడానికి దాదాపు 33 వారాలు పట్టింది.
పెరుగుతున్న కేసులు..
అత్యధిక కేసులు, మరణాలతో వణికిపోయిన అమెరికా.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభిస్తుండడంతో న్యూయార్క్, లాస్ఏంజిల్స్ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో మరోసారి ఆంక్షలు విధించారు. గతవారం సగటున రోజుకు 90 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకు క్రితం వారంతో పోలిస్తే కొత్త కేసులు ఏకంగా 43 శాతం ఎగబాకాయి. దీంతో ఆసుపత్రులకు తాకిడి పెరిగింది.
మరింత వేగవంతంగా వ్యాక్సినేషన్..
దీన్ని తీవ్రంగా పరిగణించిన సీడీసీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గత ఏడు రోజుల సగటు వ్యాక్సినేషన్ క్రితం వారంతో పోలిస్తే 11 శాతం.. గత రెండు వారాలతో పోలిస్తే 44 శాతం పెరిగినట్లు షాపర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని