Ambani bomb scare case: అంబానీకి బెదిరింపుల కేసులో.. ‘బాలాజీ కుర్కురే’
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 10వేల పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సస్పెండ్కు గురైన పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే కీలక సూత్రధారి అని ఎన్ఐఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబయి మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ గురించి కూడా కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ కేసులో పరమ్ బీర్.. బాలాజీ కుర్కురే పేరుతో నిందితులతో మాట్లాడినట్లు తెలిసింది.
అంబానీకి బెదిరింపుల కేసులు, వ్యాపారి మన్సుఖ్ హీరేన్ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ.. ఇన్స్పెక్టర్ సచిన్ వాజే సహా పలువురు నిందితులను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈ నిందితులతో ఎవరెవరు రహస్య చర్చలు చేశారన్న దానిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ‘బాలాజీ కుర్కురే’ అనే ఫేస్టైం ఐడీ పేరు బయటికొచ్చింది. ఈ ఐడీతోనే ముంబయికి చెందిన ఓ అనుమానిత వ్యక్తి నిందితులతో రహస్యంగా చాట్ చేసినట్లు తెలిసింది. దీంతో ఎన్ఐఏ కూపీ లాగకా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫేస్టైం ఐడీని ముంబయి మాజీ కమిషనర్ పరమ్బీర్ సింగ్ ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్లో పరమ్బీర్ ఓ కొత్త ఫోన్ కొనుగోలు చేశారు. ఆ ఫోన్ ఇవ్వడానికి పరమ్బీర్ ఆఫీస్కు వచ్చిన వ్యక్తి అందులో ఫేస్టైంని యాక్టివేట్ చేశారు. ఐడీ పేరు ఏం పెట్టాలా అని చూస్తున్న సమయంలో అక్కడే టేబుల్పై ఉన్న బాలాజీ కుర్కురే ప్యాకెట్ను చూశాడు. దీంతో ఆ పేరుతోనే ఐడీని క్రియేట్ చేసినట్లు ఓ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ ఫేస్టైం ఐడీతోనే పరమ్బీర్.. సచిన్ వాజే సహా పలువురు నిందితులతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ తన ఛార్జ్షీట్లో తెలిపింది.
నివేదిక మార్చేందుకు రూ.5లక్షలు..
అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపిన వార్త బయటకు రాగానే జైషే ఉల్ హింద్ అనే ఉగ్రముఠా పేరుతో టెలిగ్రామ్లో ఓ పోస్ట్ వచ్చింది. అంబానీని బెదిరించింది తామేనంటూ ఆ ముఠా పేర్కొనట్లుగా ఉంది. అయితే దీని వెనుక కూడా పరమ్బీర్ సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ సైబర్ నిపుణుడికి భారీ మొత్తంలో డబ్బు సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. జైషే ఉల్ హింద్ పేరుతో వచ్చిన మెసేజ్.. అసలు అంబానీ నివాసానికి సంబంధించింది కాదు. కానీ పరమ్ బీర్ సింగ్ ఆదేశాలతో తాను ఆ నివేదిక ఇచ్చానని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు చెప్పినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఇందుకోసం పరమ్ బీర్ తొలుత రూ. 3లక్షలు ఇస్తానని ఒప్పుకోగా.. తర్వాత రూ. 5లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక, మన్సుఖ్ హీరేన్ మృతి తర్వాత వాజే, మరో పోలీసు ప్రదీప్ శర్మను.. పరమ్బీర్ కలిశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఈ రెండు కేసుల్లో పరమ్బీర్పైనా విచారణ జరుగుతోంది. అయితే కొన్ని నెలలుగా ఆయన కన్పించకుండా పోయారు. ఆయనపై కేసుల విచారణకు సంబంధించి కోర్టు నోటీసులు వస్తున్నప్పటికీ ఆయన హాజరవ్వట్లేదు. పరమ్బీర్ ఫోన్నంబరు కూడా స్విచ్ఛాఫ్లో ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముంబయిలోని అంబానీ నివాసం ఎదుట జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ కారు నిలిపి ఉంచడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు మార్చి 5న సదరు కారు యజమాని హీరేన్ శవమై కన్పించాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సచిన్ వాజేనే అని, సూపర్ కాప్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాడని ఇటీవల ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతేగాక.. హీరన్ను హత్య చేయించింది కూడా అతడే అని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు