Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
New Parliament Designer: ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ యావత్ దేశం గర్వపడేలా నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మరి ఈ అద్భుత భవనాన్ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: దేశ చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్ నూతన భవనాన్ని (new Parliament) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అట్టహాసంగా ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం.. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడుగునా ప్రతిబింబిస్తోంది. మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ నూతన భవనాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..? ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ హస్ముఖ్ పటేల్ (Bimal Hasmukh Patel).
ఎవరీ బిమల్ పటేల్..
నూతన పార్లమెంట్ భవన రూపాన్ని డిజైన్ చేసింది గుజరాత్కు చెందిన హెచ్సీపీ డిజైన్స్ (HCP Designs) అనే సంస్థ. దాని యజమానే బిమల్ పటేల్ (Bimal Hasmukh Patel). గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన పటేల్ 1961 ఆగస్టు 31న జన్మించారు. ఆర్కిటెక్చర్ కళ పటేల్కు ఆయన తండ్రి నుంచే వచ్చింది. ఆయన తండ్రి హస్ముఖ్ చందూలాల్ పటేల్ వాస్తుశిల్పి. ఆయనే 1960లో హెచ్సీపీ సంస్థను ప్రారంభించారు. తండ్రికి తగ్గ వారసుడిగా బిమల్ పటేల్ కూడా ఇదే రంగంలోకి అడుగుపెట్టారు. అహ్మదాబాద్లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (CEPT)లో ఆర్కిటెక్చరల్ ఎడ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి.. కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి రీజినల్ ప్లానింగ్లో పీహెచ్డీ సాధించారు. తాను చదివిన CEPT యూనివర్శిటీకి 2012లో ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఓవైపు విద్యావేత్తగా కొనసాగుతూనే హెచ్సీపీ సంస్థనూ నడిపిస్తున్నారు.
త్రికోణ ఆకారం అందుకే..
2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్ట్లో హెచ్సీపీ డిజైన్స్ సంస్థ కన్సల్టెన్సీ బిడ్ను దక్కించుకుంది. అలా పార్లమెంట్ను డిజైన్ చేసే బాధ్యత బిమల్ పటేల్కు దక్కింది. దేశ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు చిహ్నాంగా సరికొత్తగా పార్లమెంట్ భవనాన్ని ఆయన డిజైన్ చేశారు. ‘రైజింగ్ ఇండియా’ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దామని బిమల్ తెలిపారు. ఇక.. పాత పార్లమెంట్ వృత్తాకారంలో ఉండగా.. కొత్త పార్లమెంట్ను త్రికోణాకృతిలో తీర్చిదిద్దారు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట. ‘‘దేశంలోని అన్ని సంస్కృతుల్లో త్రిభుజాలకు పవిత్ర ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు శ్రీయంత్రం, త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. అందుకే ఆ నిర్మాణాన్ని ఎంచుకున్నాం. ఇక, లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్ లాన్ ఇలా మూడు ప్రధాన భాగాలుగా పార్లమెంట్ను డిజైన్ చేశాం’’ అని బిమల్ పటేల్ ఓ సందర్భంలో తెలిపారు.
పార్లమెంట్తో పాటు బిమల్ పటేల్ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు డిజైన్ చేశారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్, పూరీలోని జగన్నాథ ఆలయ మాస్టర్ ప్లానింగ్ను రూపొందించింది ఈయన సంస్థే. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేవలకు గానూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం బిమల్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.