Nawab Malik: ఎవరీ నవాబ్ మాలిక్? అరెస్టయిన ఈ మంత్రి గురించి మీకు తెలుసా?
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్టయ్యారు. ఈ కేసులో ఉదయం....
ఇంటర్నెట్ డెస్క్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్టయ్యారు. ఈ కేసులో ఉదయం ఆయన్ను విచారణకు పిలిచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. మంత్రిని అరెస్టు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై గత కొంత కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నవాబ్ మాలిక్ నోరు నొక్కేందుకే కేంద్రం ఇలాంటి కక్షపూరిత వైఖరిని అనుసరిస్తోందని ఎన్సీపీ, శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. గతేడాది షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సమయంలో సంచలన వ్యాఖ్యలతో మాలిక్ జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
- ఎవరీ నవాబ్ మాలిక్?: నవాబ్ మాలిక్ యూపీలోని గోండా జిల్లా ధుస్వా గ్రామంలో 1959 జూన్ 20న జన్మించారు. ఆయన కుటుంబానికి ముంబయిలో వ్యాపారాలు ఉండటంతో మూడు నెలల ప్రాయంలోనే ముంబయి నగరానికి వచ్చి స్థిరపడ్డారు. డోంగ్రిలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. నవాబ్ మాలిక్ ముంబయిలోని అణుశక్తి నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం మహారాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
- రాజకీయాల్లోకి ఎంట్రీ ఇలా..: సంజయ్ గాంధీని చూసి ఆకర్షితుడైన మాలిక్.. తొలుత యూత్ కాంగ్రెస్లో చేరారు. ఆయన మరణానంతరం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మేనకా గాంధీ ఏర్పాటు చేసిన సంజయ్ విచార్ మంచ్లో చేరారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని నిలబెట్టాలని మంచ్ నిర్ణయించింది. అప్పుడు మాలిక్కు 26 ఏళ్లు. 1984 లోక్సభ ఎన్నికల్లో ఆయన్ను పోటీ చేయాలని అడగడంతో బాంబే నార్త్ ఈస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అప్పటికే కీలక నేతలైన గురుదాస్ కామత్, ప్రమోద్ మహజన్లకు వ్యతిరేకంగా బరిలో దిగిన మాలిక్కు కేవలం 2950 ఓట్లు మాత్రమే వచ్చాయి.
- 1992లో ముంబయి అల్లర్ల తర్వాత నవాబ్ మాలిక్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. నెహ్రూనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి శివసేన అభ్యర్థి సూర్యకాంత్ మహాదిక్ చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచారు. అయితే, మహాదిక్ ఎన్నికను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 7వేల ఓట్ల తేడాతో మాలిక్ తొలిసారి విజయం సాధించారు. 1999లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై బరిలో దిగి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ.. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో మంత్రి పదవి ఆఫర్ చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నవాబ్ మాలిక్ తొలిసారి గృహనిర్మాణశాఖ మంత్రిగా అవకాశం దక్కింది.
- కేబినెట్లోకి ప్రవేశించిన కొద్ది నెలల తర్వాత ఆయన క్రమంగా సమాజ్వాదీ పార్టీకి దూరమయ్యారు. అక్టోబర్ 13, 2001న ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరిపోయారు. శరద్ పవర్కు సన్నిహితుడిగా ఉంటూ కీలక పదవుల్లో పనిచేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్య, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు.
- మాలిక్పై అన్నాహజారే అవినీతి ఆరోపణలు: అయితే, ప్రముఖ సామాజిక ఉద్యమనేత అన్నా హజారే.. మంత్రి నవాబ్మాలిక్తో పాటు కాంగ్రెస్-ఎన్సీపీకి చెందిన మరో ముగ్గురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఓ ప్రయివేటు బిల్డర్కు లబ్ధి చేకూర్చేలా మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ముంబైలోని ఓ భారీ భవనం పునర్నిర్మాణాన్ని మాలిక్ నిలుపుదల చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2005లో మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసిన జస్టిస్ పీబీ సావంత్ కమిషన్ కఠిన చర్యలతో మాలిక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ బిల్డర్కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించింది తాను కాదనీ.. గతంలో ఉన్న శివసేన-భాజపా ప్రభుత్వమేనంటూ ఆయన వాదించారు.
- మూడేళ్ల విరామం తర్వాత అశోక్ చవాన్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో 2008లో నవాబ్ మాలిక్ కార్మికశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2009లో కాంగ్రెస్ ఎన్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ మాలిక్కు కేబినెట్లో చోటుదక్కలేదు. దీంతో ఆయన ఎన్సీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో మాలిక్ 1007 ఓట్ల తేడాతో పరాజయం పాలైనప్పటికీ పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు.
- ఎన్సీపీలో కొద్దిమంది ముస్లిం నేతల్లో నవాబ్ మాలిక్ ఒకరు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా సోషల్ మీడియా యంత్రాంగాన్ని ఎదుర్కోవడంలో అధికారప్రతినిధిగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏర్పాటైన మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ మంత్రిగా రీఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను శరద్పవార్కు సన్నిహితుడిగా పేర్కొంటారు.
- గతేడాది జనవరిలో మాలిక్ అల్లుడు, వ్యాపారవేత్త సమీర్ షబ్బీర్ఖాన్ను సమీర్ వాంఖడే సారథ్యంలోని ఎన్సీబీ అరెస్టు చేసింది. అప్పటికే బ్రిటిష్ జాతీయుడు కరణ్ సాజ్నానీని అరెస్టు చేసిన ఎన్సీబీ.. అతడి నుంచి 75 కిలోల గంజాయి, 125 కిలోల గంజాయి సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుంది. సాజ్నానీని విచారించడంతో అతడికి, షబ్బీర్ఖాన్కు మధ్య డబ్బు మార్పిడి జరిగినట్టు గుర్తించామని ఎన్సీబీ పేర్కొంది. ఆ తర్వాత షబ్బీర్ ఖాన్ను పిలిపించి గతేడాది జనవరి 9న అరెస్టు చేసింది. అనంతరం సెప్టెంబర్లో అతడికి బెయిల్ మంజూరైంది. అయితే, తన అల్లుడిని ఇరికించారంటూ నవాబ్ మాలిక్ అప్పట్లో ఆరోపించారు.
- ఆ తర్వాత కొన్నాళ్లకే బాలీవుడ్ స్టార్ షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్టు చేసినప్పుడు నవాబ్ మాలిక్ ఎన్సీబీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్రూజ్ నౌకలో డ్రగ్స్ దొరికాయంటూ ఎన్సీబీ చెప్పడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాంఖడే తప్పుడు మాదకద్రవ్యాల కేసులను నమోదు చేశారని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు బీజేపీ పావుగా వ్యవహరిస్తున్నారని మాలిక్ అప్పట్లో ఆరోపణలు గుప్పించి జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
- ఫిబ్రవరి 15న ముంబయిలో 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ సమీప బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేసి.. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ని అరెస్టు చేశారు. అతడిని విచారించగా..మంత్రి నవాబ్ మాలిక్ కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటకొచ్చినట్టు సమాచారం. దీంతో మంత్రిని విచారణకు పిలిచిన అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. విచారణకు సహకరించనందునే అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ