Sameer Wankhede: సమీర్ వాంఖడే.. ‘తెర’చాటు డ్రగ్స్పై ముంబయి ‘సింగం’
సమీర్ వాంఖడే.. బాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలకు మింగుడు పడని పేరిది. మాదక ద్రవ్యాల ‘తెర’చాటు వ్యవహారాలపై ఆయనో సింహస్వప్నం. నార్కోటిక్స్
ముంబయి: సమీర్ వాంఖడే.. బాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలకు మింగుడు పడని పేరిది. మాదక ద్రవ్యాల ‘తెర’చాటు వ్యవహారాలపై ఆయనో సింహస్వప్నం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబయి జోనల్ డైరెక్టర్ అయిన సమీర్.. బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేస్తూ డ్రగ్స్ డీలర్లు, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో రూ. 17వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే ఆయన ఎంతటి నిఖార్సైన ఆఫీసరో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధమున్న డ్రగ్స్ కేసు నుంచి.. తాజాగా నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్టు వరకు ఆయన చర్యలన్నీ సంచలనమే. విధి నిర్వహణలో భాగంగా ప్రపంచకప్ ట్రోఫీనే అడ్డుకున్న వ్యక్తి ఈయన..!
ఎవరీ సమీర్ వాంఖడే..
40ఏళ్ల సమీర్ వాంఖడే స్వస్థలం ముంబయి. తండ్రి కూడా పోలీసు అధికారే. 2008 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సమీర్.. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు ఎస్పీగా పనిచేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలెజెన్స్ జాయింట్ కమిషనర్గానూ వ్యవహరించారు. ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మారి ప్రస్తుతం ముంబయి జోనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వృత్తి పట్ల చాలా నిజాయతీగా ఉండే సమీర్.. నిర్భయంగా, క్రమశిక్షణగా పనిచేస్తారని తనతో పాటు పనిచేసిన అధికారులు చెబుతుంటారు. సినిమాలు, క్రికెట్ను అమితంగా ఇష్టపడే ఆయన.. విధి నిర్వహణకు వచ్చేసరికి మాత్రం అవేవీ పట్టించుకోరు.
సెలబ్రిటీలతో పన్నులు కట్టించి..
2010లో సమీర్ మహారాష్ట్ర సర్వీస్ టాక్స్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో పన్నులు ఎగ్గొట్టిన 2500 మందిపై కేసులు పెట్టారు. అందులో 200 మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అక్కడ పనిచేసిన రెండేళ్లలో ఖజానాకు రూ.87కోట్ల పన్నులు రప్పించారు. ఆ తర్వాత కస్టమ్స్ విభాగంలో పనిచేసినప్పుడు కూడా కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. విదేశాల నుంచి సెలబ్రిటీలు తెచ్చుకున్న వస్తువులకు పన్నులు చెల్లించేవరకు కస్ట్సమ్ క్లియరెన్స్ ఇచ్చేవారు కాదు. 2013లో విదేశీ కరెన్సీతో వస్తున్న ప్రముఖ సింగర్ మికా సింగ్ను అరెస్టు చేయడంతో అప్పట్లో ఆయన పేరు మార్మోగింది. పన్ను ఎగవేత కేసుల్లో అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబెరాయ్, రామ్ గోపాల్ వర్మ సహా చాలా మంది సినీ ప్రముఖల ఇళ్లల్లో సోదా చేశారు.
ప్రపంచ కప్ ట్రోఫీని వదిలిపెట్టలేదు..
2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన సమయంలో ఆ ట్రోఫీని ముంబయి ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు. ప్రపంప కప్ ట్రోఫీని పూర్తిగా బంగారంతో చేస్తారు. అందువల్ల దానికి కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఆ సుంకం చెల్లించిన తర్వాతే ట్రోఫీని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు.
రెండేళ్లలో రూ. 17వేల కోట్ల డ్రగ్స్ను పట్టుకుని..
ఎన్సీబీలో చేరిన తర్వాత డ్రగ్స్ డీలర్లపై సమీర్ ఉక్కుపాదం మోపారు. గత రెండేళ్లలో ఆయన నేతృత్వంలో ఎన్సీబీ బృందం అనేక చోట్ల దాడులు జరిపి రూ.17వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధమున్న డ్రగ్స్ కేసును బయటకు తీసుకొచ్చింది కూడా ఈయనే. ఆ సమయంలో సినీ నటి రియా చక్రవర్తిని స్వయంగా ఆయనే విచారించినట్లు కూడా సమాచారం.
గతేడాది ఓ డ్రగ్ డీలర్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితులు చేసిన దాడిలో గాయపడ్డారు. తాజాగా ముంబయి తీరంలోని కార్డెలియో క్రూజ్ ఎంప్రెస్ నౌకపై జరిగిన రేవ్ పార్టీకి సమీర్ వాంఖడే తన సిబ్బందితో కలిసి ప్రయాణికుల మాదిరిగా వెళ్లి.. రెడ్ హ్యాండెడ్గా నిందితులను పట్టుకున్నారు. ప్రముఖ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ సహా 9 మందిని అరెస్టు చేశారు.
బాలీవుడ్తో అనుబంధం..
అన్నట్టు.. సమీర్కు బాలీవుడ్తో వృత్తి పరంగానే కాదండోయ్, వ్యక్తిగతంగానూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సతీమణి కూడా హీరోయినే. మరాఠీ నటి క్రాంతీ రేద్కర్ను సమీర్ 2017లో వివాహం చేసుకున్నారు. క్రాంతి రేద్కర్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 2003లో వచ్చిన గంగాజల్ సినిమాలో అజయ్ దేవగణ్తో కలిసి నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం