ఈ బడ్జెట్ పేదలకా? సంపన్నులకా?
పేద ప్రజలకు పక్కనబెట్టి కేవలం సంపన్న వర్గాల కోసమే బడ్జెట్ను రూపొందించారని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన నేడు
రాజ్యసభలో చిదంబరం విమర్శలు
దిల్లీ: పేద ప్రజలను పక్కనబెట్టి కేవలం సంపన్న వర్గాల కోసమే బడ్జెట్ను రూపొందించారని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన నేడు మాట్లాడారు. పేదలకు ఎలాంటి హామీ ఇవ్వని ఈ బడ్జెట్ను తాము తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.
‘‘ప్రభుత్వ విధానాలు, కరోనా మహమ్మారి వల్ల దేశంలో 12కోట్ల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. 35శాతం ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. వెనుకబడిన రాష్ట్రాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఈ సమస్యలకు ఒకటే పరిష్కారం.. నిపుణులు, ఆర్థికవేత్తల నుంచి విలువైన సలహాలు తీసుకుని వ్యవస్థీకృత సమస్యలను పరిష్కరించాలి. కానీ, ప్రభుత్వం ఏం చేసింది. పేదలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. అలాంటప్పుడు ఈ బడ్జెట్ ఎవరికోసం రూపొందించారు? ఇది కేవలం సంపన్నుల కోసం సంపన్నులు తయారుచేసిన బడ్జెట్ మాత్రమే. పేదలకు ఎలాంటి సహకారం ఇవ్వలేని ఈ పద్దును మేం తిరస్కరిస్తున్నాం’’ అని చిదంబరం తెలిపారు.
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతోంది. శుక్రవారం ఆర్థికమంత్రి సీతారామన్.. రాజ్యసభలో విపక్షాల ప్రశ్నలపై సమాధానమివ్వనున్నారు. ఆ తర్వాత రాజ్యసభను మార్చి 8కి వాయిదా వేయనున్నారు. శనివారం లోక్సభలోనూ రిప్లై ఇచ్చిన అనంతరం ఆ సభ కూడా వాయిదా పడనుంది.
నిజానికి బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఈ నెల 15 వరకు జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగానే వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరిగి మార్చి 8 నుంచి రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!