Poonch encounter: ఈ దుర్మార్గుడు జియా ముస్తఫా ఎవరో తెలుసా..?
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఆదివారం ఓ ఊహించని ఘటన చోటు చేసుకొంది. కరుడుగట్టిన ఉగ్రవాది జియా ముస్తఫా ఆ
పూంచ్ ఎన్కౌంటర్లో హతమైన ‘నదీమార్గ్’ నరమేధం సూత్రధారి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఆదివారం ఓ ఊహించని ఘటన చోటు చేసుకొంది. కరుడుగట్టిన ఉగ్రవాది జియా ముస్తఫా ఆ ఎన్కౌంటర్లో మరణించాడు. ముష్కరుల స్థావరాలను గుర్తించేందుకు జైల్లో ఉన్న జియాను భద్రతా దళాలు అడవుల్లోకి తీసుకెళ్లాయి. దళాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భారీఎత్తున కాల్పులు జరపడంతో కొందరు జవాన్లతో పాటు జియా కూడా గాయపడ్డాడు. అతడిని ఆ ప్రదేశం నుంచి బయటకు తేవడానికి దళాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఘటనాస్థలంలోనే జియా మరణించాడు. సోమవారం 15 రోజు కూడా మెందహార్ అడవుల్లో భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి.
శనివారమే పోలీస్ రిమాండ్కు..
2003లో అరెస్టైన జియా ముస్తఫా తొలుత శ్రీనగర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కానీ, 2018లో నవీద్ జాట్ అనే ఉగ్రవాది ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రి నుంచి పరారవడంతో జియాను జమ్మూలోని కోట్ బాల్వాల్ జైలుకు తరలించారు. తోటి ఖైదీలను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో తిహార్ జైలుకు పంపించాలనుకున్నారు. కానీ, అది జరగలేదు. దీంతో కోట్ బాల్వాల్ జైల్లోనే ఉండిపోయాడు. అక్కడి నుంచి పాకిస్థాన్లోని లష్కరే ఉగ్రవాదులతో ‘టచ్’లో ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం మెందహార్ పోలీసులు 10 రోజుల రిమాండ్లోకి తీసుకొన్నారు. ఆదివారం అతన్ని బాతా దురియా వద్ద ఎన్కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల దాడిలో జియా మరణించాడు. అతికష్టం మీద ముస్తఫా మృతదేహాన్ని దళాలు స్వాధీనం చేసుకొన్నాయి.
ఉగ్రవాదుల్లో పెద్దచేప..!
2001లో నియంత్రణ రేఖను దాటి కశ్మీర్లో ప్రవేశించిన జియా ముస్తఫా చిన్నా.. చితకా ఉగ్రవాది కాదు. 24 మంది కశ్మీరీ పండిట్ల ప్రాణాలను బలిగొన్న ‘నదీమార్గ్’ నరమేధానికి సూత్రధారి. 2003 ఏప్రిల్ 10వ తేదీన ముస్తఫా అరెస్టును నాటి కశ్మీర్ డీజీపీ ఏకే సూరీ శ్రీనగర్లో ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇదో పెద్ద విజయంగా అప్పట్లో పేర్కొన్నారు. ముస్తఫా.. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో జిల్లా కమాండర్గా పనిచేశాడు. పాక్లోని లష్కరే నాయకత్వం ఆదేశాల మేరకే తాను నరమేధానికి పాల్పడినట్లు జియా విచారణలో వెల్లడించాడు. 2003 ఏప్రిల్ చివర్లో జియా ఇచ్చిన సమాచారం ఆధారంగా యారీపోరాలోని ఒక ఇంటిపై భద్రతా దళాలు దాడిచేసి అబు రఫీ, అబు వసీం, అబు బిలాల్ అనే ముగ్గురు పాక్ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశాయి. వీరు ముగ్గరు కూడా నదీమార్గ్ నరమేధంలో పాల్గొన్నారు.
ఏమిటీ ‘నదీమార్గ్ నరమేధం’..?
1990ల్లో కశ్మీరీ పండిట్లపై దాడులు జరగడంతో ‘నదీమార్గ్’ గ్రామంలోని చాలా మంది ఇళ్లు వదిలి జమ్మూ సహా ఇతర ప్రాంతాలకు వలసపోయారు. కానీ, 50 కుటుంబాలు మాత్రం ధైర్యంగా ‘నదీమార్గ్’లోనే ఉన్నాయి. ఈ గ్రామానికి తొమ్మిది మంది పోలీసులతో పికెట్ కూడా ఉంది. కానీ, 2003 మార్చి 23వ తేదీన ముగ్గరు పోలీసులు రాలేదు. ఆ రోజు రాత్రి దాదాపు 12 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గ్రామానికి వచ్చారు. వీరు తొలుత పోలీస్ పికెట్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ఆరుగురు పోలీసులు నిద్రపోతుండటంతో వారి ఆయుధాలను తీసుకొని వారిని బంధించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కశ్మీరీ పండిట్లను వీధుల్లోకి ఈడ్చుకొచ్చి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. మృతుల్లో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పలు దేశాలు ఈ దాడిని ఖండించాయి. నిందితులకు శిక్షపడేందుకు అవసరమైన సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.
శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో..!
2003 సంవత్సరంలో భారత్-పాక్ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భారత్-పాక్లు తెరవెనుక చర్చలను మొదలుపెట్టాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొనే అవకాశాలు మెరుగుపడుతున్నప్పుడు నదీమార్గ్ ఘటన చోటు చేసుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ