Anindita Chatterjee: పిల్లలుంటే ఏమైంది? నెలల పాపతో 10 దేశాలు చుట్టి వచ్చా!
పిల్లలు చిన్నవాళ్లని.. అందుకే విహార యాత్రలకు వెళ్లడం లేదంటూ కొందమంది చెబుతుంటారు. అలాంటి వారికి ముంబయి చెందిన ట్రావెలర్ అనిందిత (Anindita Chatterjee) చేసిన సూచనలేంటో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కొక్కరిది ఒక్కో అభిలాష. కొందరు ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడితే.. ఇంకొందరు మాత్రం ప్రపంచం (World) చుట్టేసి రావాలనుకుంటారు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దేశ విదేశాల్లో తిరగాలని (Travelling) మనసులో బలంగా కోరిక ఉన్నప్పటికీ పెళ్లి, పిల్లలు అయిన తర్వాత చాలా మంది విహారయాత్రలు చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా స్త్రీలకు ఇది వర్తిస్తుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమో? వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఎన్నో ఆలోచనలు. వీటన్నింటికీ చెక్ పెడుతున్నారు ముంబయి చెందిన అనిందితా ఛటర్జీ (Anindita Chatterjee).
ఉద్యోగానికి రాజీనామా చేసి..
41 ఏళ్ల అనిందితా ఛటర్జీకి విదేశాల్లో పర్యటించడమంటే మహా సరదా. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరించేవారు. పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి ఆమె విదేశీ పర్యటనలు కొనసాగించారు. అలా 2017లో @travel.chatter ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించి తన పర్యటన విశేషాలను అందులో పంచుకునే వారు. 2020లో పూర్తిగా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్కే కేటాయించారు. తాను గర్భవతినని తెలిసేసరికి ఆమె మెక్సికోలో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యలు వెంటనే ఆమెను వెనక్కి వచ్చేయమని చెప్పారు. అయినా ఆమె వినలేదు. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే తిరిగి ముంబయికి వచ్చారు.వైద్యుడి సూచన మేరకు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ విహారయాత్రలు మొదలు పెట్టారు అలా గర్భవతిగా ఉన్నప్పుడే నాలుగు దేశాల్లో పర్యటించారు అనిందిత.
87 దేశాల్లో పర్యటించి..
డెలివరీ అయిన తర్వాత కేవలం 45 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారట. పాపకు ఏడాది పూర్తయ్యేసరికి 14 దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఫాలోవర్లకు చేరవేసేవారు. ఆమె ట్రావెలింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 87 దేశాల్లో పర్యటించారట. ‘‘ ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. గర్భవతినైతే తప్పేంటి. అందులో వింతేముంది. గర్భవతి అయినంత మాత్రాన మనం నిత్యం చేస్తున్న పనులను ఆపడం లేదు కదా. అందుకే నేను కూడా ట్రావెలింగ్ ఆపలేదు.’’ అంటూ చెప్పుకొచ్చారు అనిందిత. మెక్సికో, కొలంబియా లాంటి ఎన్నో సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటించి ఆ విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె ప్రతి రోజూ క్రమం తప్పకుండా కనీసం 10 కిలోమీటర్లు నడుస్తారట.
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..
చిన్న చిన్న కారణాలతో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అనిందిత చెబుతున్నారు. మనం మన కలలను నెరవేర్చుకునేందుకు శ్రమించినప్పుడే.. మన పిల్లలు కూడా వాటిని చూస్తూ పెరిగి.. వాళ్ల కలలను సాకారం చేసుకుంటాని ఆమె అంటున్నారు. ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ముందుగా దాని గురించి పరిశోధన చేసి, అక్కడ చూడదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయేమో తెలుసుకున్న తర్వాతనే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారట. అయితే పాప పుట్టిన తర్వాత వీలైంత వరకు పగటిపూట ట్రావెల్ చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నామని చెబుతున్నారు. చిన్నారి కూడా తమ ట్రావెలింగ్కు ఎంతో సహకరిస్తోందని, కొత్తవారు ఎదురైతే హాయ్ అంటూ వారిని పలకరిస్తోందని, ఆమె కూడా ట్రిప్ని ఎంజాయ్ చేస్తుండటంతో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని అనిందిత వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. -
యునెస్కో జాబితాలో గర్బా నృత్యం
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. -
100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత
చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. -
అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. -
అంబేడ్కర్కు ప్రధాని ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షిప్త వార్తలు
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. -
వరద నుంచి తేరుకోని చెన్నై
మిగ్జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Ratan Tata: రిస్క్లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాలో పోస్టు
రతన్ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్లో వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం