Ashraf Ghani: అష్రఫ్ ఘనీ యూఏఈకే ఎందుకు వెళ్లారు?
మానవతా దృక్పథంతో అష్రఫ్ ఘనీకి ఆశ్రయం కల్పిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈయనే కాదు.. గతంలోనూ పలు దేశాధినేతలు పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. మరి వీరంతా యూఏఈనే ఎందుకు ఎంచుకున్నారు?
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ఘనీ అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన విషయం తెలిసిందే. అయితే, తొలుత ఆయన తజకిస్థాన్ లేదా ఒమన్కి వెళ్లి ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ, చివరకు ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి వెళ్లి సెటిలయ్యారు. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈయనే కాదు.. గతంలోనూ పలు దేశాధినేతలు పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు.
యూఏఈనే ఎందుకు?
యూఏఈ ఇప్పటి వరకు అనేక మంది బహిష్కృత లేదా ఆశ్రయం కోరి వచ్చిన ఇతర దేశాధినేతలకు ఆశ్రయం కల్పించింది. దేశ రాజధాని అబుదాబి ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ఎత్తైన భవనాలు, విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లకు ఇది నెలవు. అలాగే తీర ప్రాంతాల్లోని కట్టడాలు కట్టుదిట్టమైన భద్రతలోఉంటాయి. ఈ నేపథ్యంలో ఏకాంతాన్ని కోరుకునే వారికి ఈ ప్రాంతాలు చాలా అనువుగా ఉంటాయి. తమని తాము రక్షించుకోవడంతో పాటు తమ సంపదకు కూడా ఇక్కడ రక్షణ ఉంటుందని విశ్వసిస్తుంటారు.
ఇక భారీ ఎత్తున చమురు, సహజవాయు నిల్వలు ఉన్న నేపథ్యంలో యూఏఈలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి హోటళ్లకు చేరుకునే వరకు గట్టి నిఘా వ్యవస్థ మధ్య కదలాల్సి ఉంటుంది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఐరిస్ స్కానింగ్, సెక్యూరిటీ కెమెరాలు మరింత రక్షణ కల్పిస్తాయి. దీంతో అక్కడ తలదాచుకునే నేతల్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాగే యూఏఈకి అమెరికా భద్రత, రక్షణపరమైన సహకారం అందిస్తోంది.
యూఏఈ ఎందుకు చేస్తోంది?
ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం ప్రపంచ రాజకీయాలపై తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని యూఈఏ ఆరాటపడుతున్నట్లు విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా మెప్పు కోసం యూఏఈ ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. తాము కూడా అమెరికాకు నమ్మదగిన మిత్రదేశమేనని నిరూపించుకునేందుకు ఆ దేశాధినేతలు ప్రయత్నిస్తున్నారు. అబుదాబి సమీపంలో ఉన్న అల్దఫ్రా వైమానిక స్థావరం నుంచి అమెరికా కార్యకలాపాలు కూడా కొనసాగిస్తోంది. ఇలా అమెరికాతో బలమైన సంబంధాల్ని ఏర్పరచుకోవడం ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందాలన్న ఆలోచనలో యూఏఈ ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇంకా ఎవరెవరు ఆశ్రయం పొందారు?
యూఏఈ రాజధాని అబుదాబి సహా వాణిజ్య, పర్యాటక కేంద్రంగా ఉన్న దుబాయ్లోనూ అనేక మంది నేతలు తలదాచుకుంటున్నారు. అవినీతి సహా పలునేరాల్లో దోషులుగా తేలిన థాయ్లాండ్ మాజీ ప్రధానులు థక్సిన్ శినవట్ర, యింగ్లక్ శినవట్ర ఇక్కడే ఉన్నారు. పాకిస్థాన్కు తిరిగొచ్చి 2007లో హత్యకు గురైన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కూడా యూఏఈలోనే చాలాకాలం నివసించారు. మరో పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కూడా దుబాయ్లోనే ఉన్నారు. ఆర్థిక అభియోగాలున్న స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్, జైలు శిక్ష పడిన పాలస్తీనా నేత మహమ్మద్ దహ్లాన్, యెమెన్లో కీలక నేత అహ్మద్ అలీ అబ్దుల్లా సాలేహ్ కూడా యూఏఈలోనే తలదాచుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?