Wheat prices: దేశంలో గోధుమ పిండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కారణాలివే!
దేశంలో ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతుండటంతో నిత్యావసరాల ధరలూ మండిపోతున్నాయి. దీంతో ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.........
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. నిత్యం ఇంట్లో వాడే గోధుమ పిండి ధరలు కూడా తాజాగా గరిష్ఠస్థాయికి చేరాయి. ఏప్రిల్లో కిలో గోధుమ పిండి నెలవారీ సగటు రిటైల్ ధర రూ.32.38గా ఉంది. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం కావడం గమనార్హం. అసలు దేశంలో గోధుమ పిండి ధరలు పెరగడానికి కారణాలేంటి?
- మన దేశంలో గోధుమల ఉత్పత్తి, నిల్వలు క్షీణించడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ గోధుముల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమలకు కొరత ఏర్పడటంతో.. ఎగుమతులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
- గోధుమ ఉత్పత్తిలో రష్యా, ఉక్రెయిన్ ప్రధాన ఉత్పత్తిదారు దేశాలుగా ఉన్నాయి గోధుమ ఉత్పత్తిలో రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదారు కాగా.. ఉక్రెయిన్ నాలుగోది. ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గోధుముల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామం ధరల పెరుగుదలకు దారితీసింది.
- గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 70లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా గోధుమల కొరత సృష్టించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.
- ఈసారి మన దేశంలో వేసవి ముందుగానే రావడం కూడా గోధుమ ఎగమతులు తగ్గడానికి ప్రధాన కారణం. 2020-21లో గోధుమల ఉత్పత్తి అంచనా 109.59 మిలియన్ టన్నులు కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 110 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. అయితే, మార్చిలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ లక్ష్యాలు నీరుగారిపోయాయి.
- గోధుమ పిండి ధరలతో పాటు బేకరీ బ్రెడ్ ధరలూ కొన్ని నెలలుగా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ఛార్జీలతో లాజిస్టిక్స్ భారమై గోధుమ, గోధుమ పిండి ధరల పెరుగుదలకు మరో కారణంగా పేర్కొంటున్నారు.
మరోవైపు, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖకు రాష్ట్ర పౌరసరఫరా శాఖలు అందించిన సమాచారం ప్రకారం.. మే 7న మన దేశంలో గోధుమ పిండి కిలో సగటు రిటైల్ ధర రూ.32.78గా ఉన్నట్టు పేర్కొన్నాయి. గతేడాది కిలో గోధుమ పిండి ధర రూ.30.03గా ఉండగా.. ఇప్పుడు దాదాపు 9.15శాతం పెరగడం గమనార్హం. దేశంలోని 156 కేంద్రాలకు సంబంధించిన అందుబాటులో ఉన్న డేటాను బట్టి శనివారం పోర్ట్ బ్లెయిర్లో అత్యధికంగా కిలో గోధుమ పిండి ధర రూ.59లు ఉండగా.. బెంగాల్లోని పురూలియాలో అత్యల్పంగా కిలో ధర రూ.22గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్’ కార్యక్రమం న్యాయనిర్ణేత వినీతా సింగ్ (Vineeta Singh) మరణించారని వస్తున్న వదంతులను ఆమె సోషల్ మీడియా వేదికగా తోసిపుచ్చారు. -
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?