Delhi Highcourt: మద్యం పాలసీ మంచిదైతే.. ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?
దిల్లీ ప్రభుత్వం (Delhi Govt) తీసుకొచ్చిన మద్యం పాలసీ (Liquor Scam) మంచిదే అయినప్పుడు.. మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని దిల్లీ హైకోర్టు మనీశ్ సిసోదియాను ప్రశ్నించింది. దీనికి సూటిగా సమాధానం తెలుకొని రావాలని ఆయన తరఫు న్యాయవాదిని కోరింది.
దిల్లీ: దిల్లీ (Delhi) ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ (Liquor Policy) మంచిదే అయినప్పుడు తిరిగి దానిని ఎందుకు వెనక్కితీసుకోవాల్సి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను (Manish Sisodia) దిల్లీ హైకోర్టు (Delhi Highcourt) ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సరైన వివరణతో రావాలని ఆయన తరఫు న్యాయవాదిని కోరింది. మద్యం పాలసీ విధానంలో సిసోదియాతోపాటు మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు విజయ్ నాయర్ల మధ్యంతర బెయిల్ పిటిషన్పై జస్టిస్ దినేశ్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కుంభకోణం జరిగిన సమయంలో సిసోదియా డిప్యూటీ సీఎంతోపాటు ఎక్సైజ్శాఖ బాధ్యతలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘మీరు తీసుకొచ్చిన విధానం మంచిదే అయినప్పుడు మళ్లీ దానిని వెనక్కి ఎందుకు తీసుకున్నారు? దీనికి సూటిగా సమాధానం చెప్పండి’’ అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
గతంలోనూ న్యాయస్థానం ఇదే ప్రశ్న సంధించగా..నాన్ కన్ఫర్మింగ్ జోన్లలో మద్యం విక్రయాల కోసం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించకపోవడంతో మద్యం పాలసీ విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లు సిసోదియా తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో గతంలో పదేళ్లపాటు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనుమతించినట్లు చెప్పారు. నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ప్రతి లైసెన్సుదారు మున్సిపల్ వార్డు పరిధిలో మూడు దుకాణాలను తెరవాల్సి ఉంది. అయితే, మాస్టర్ప్లాన్ను ఉల్లంఘించినట్లు దిల్లీ స్థానిక సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో దుకాణాలను తెరవలేకపోయినట్లు సిసోదియా తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చారు.
సీబీఐ, ఈడీ కేసుల్లో గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు న్యాయస్థానం సిసోదియాకు మే 24న అనుమతిచ్చింది. అయితే, వెనక్కి తీసుకోకపోవడంతో.. మే 30న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మద్యం పాలసీ కుంభకోణంలో సిసోదియా ప్రభావవంతమైన వ్యక్తి అనీ, అతడిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంటూ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సిసోదియా, విజయ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు సిసోదియా అక్రమాలకు పాల్పడ్డారనేది సీబీఐ, ఈడీల వాదన. లైసెన్స్దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న మద్యం పాలసీని తీసుకొచ్చి.. 2022 సెప్టెంబరు చివరి నాటికి దానిని వెనక్కి తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.