గూగుల్పై వెనక్కి తగ్గేదే లే!: కర్ణాటక
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న సెర్చ్ ఇంజిన్ గూగుల్ కర్ణాటక ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది. భారతీయ భాషల్లో అందవికారమైన భాషకు సమాధానంగా కన్నడ భాషను చూపడంతో కన్నడిగులు...
కన్నడ భాషను అవహేళన చేయడంపై తీవ్ర ఆగ్రహం
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న సెర్చ్ ఇంజిన్ గూగుల్.. కన్నడ ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది. భారతీయ భాషల్లో అందవికారమైన భాషకు సమాధానంగా కన్నడ భాషను చూపడంతో కన్నడిగులు గురువారం భారీ ఆందోళనకు తెరతీశారు. వెంటనే తప్పు తెలుసుకొని గూగుల్ క్షమాపణలు చెప్పినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదంటూ కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. టెక్ దిగ్గజానికి లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమైంది.
గూగుల్ తప్పిదంపై పలువురు కర్ణాటక రాజకీయ ప్రముఖులు, భాషాభిమానులు తీవ్రంగా స్పందించారు. గూగుల్పై న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల వేదికగా గూగుల్పై విమర్శలు గుప్పించారు. కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని, తరతరాలుగా కన్నడిగులు తమ మాతృభాషను గర్వకారణంగా భావిస్తున్నారని కర్ణాటక అటవీ, సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబవల్లి పేర్కొన్నారు. కన్నడ భాషను తక్కువ చేసి చూపడం కర్ణాటక ప్రజలను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై గూగుల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. సెర్చ్ ఇంజిన్ అన్ని వేళలా కచ్చితంగా ఉండదని వెల్లడించారు. కొన్నిసార్లు అది పలు ప్రశ్నలకు విచిత్రమైన సమాధానాలు చూపడం సాధారణమే అన్నారు. అయితే ఇలాంటి సమాధానాలు ఆమోదయోగ్యమైనవి కాదన్నారు. సాధారణంగా అలాంటి సమాధానాలు గూగుల్ అభిప్రాయాలు కావని తెలిపారు. తమ వల్ల ఎవరి మనోభావాలకు భంగం వాటిల్లినా క్షమించాలని కోరారు. తాజా ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వరుస ట్వీట్లతో గూగుల్పై విరుచుకుపడ్డారు. ఇంత బాధ్యతా రాహిత్యంగా ఎలా పనిచేస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఎందుకిలా జరుగుతుంది..?
గూగుల్ మనకు కావాల్సిన సమాచారాన్ని ప్రత్యేక అల్గారిథమ్ ద్వారా మనముందుకు తెస్తుంది. గూగుల్ సెర్చ్ బాక్స్లో టైప్ చేసిన కీవర్డ్స్ ఆధారంగా, అంతర్జాలంలో అందుబాటులో ఉండే సమాచారం మేరకు ఫలితాలు కనిపిస్తాయి. యూజర్ ఏదైనా ప్రశ్నను టైప్ చేసినప్పుడు అందులోని పదాల ఆధారంగా వివిధ వెబ్సైట్లతోపాటు ఆయా పదాలతో ఇంకేమైనా సమాచారముంటే దానంతటినీ క్రోడీకరించి, సరైనదే అని నిర్ధారించుకున్నాక గూగుల్ తన యూజర్కు చూపిస్తుంది. దీనినే సెర్చింజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో) అంటారు. అందువల్ల ఇలాంటి పదాలతో ఎవరైనా సమాచారాన్ని వెబ్సైట్లలోగానీ, బ్లాగ్స్లోగానీ పోస్టు చేస్తే కొన్ని సార్లు ఇలాంటి ఫలితాలే వస్తాయని, ప్రస్తుతం కన్నడ భాష విషయంలోనూ ఇదే జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు. సెర్చ్ బాక్స్లో ‘Idiot’ అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటో ప్రత్యక్షమవ్వడం 2018 డిసెంబర్లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఎస్ఈవో ఎలా పని చేస్తుందో హౌస్ జ్యూడీషియరీ కమిటీ విచారణలో యూఎస్ కాంగ్రెస్ మహిళ జోయ్ లాఫ్గ్రెన్కి సుందర్ పిచాయ్ అప్పట్లో వివరించారు. సెర్చ్ రిజల్ట్స్పై సంస్థ నియంత్రణ ఎందుకు తక్కువగా ఉంటుందో చెప్పారు. గూగుల్లో ఫలితాలన్నీ సెర్చ్ ఇండెక్స్, వెబ్పేజెస్, కీ వర్డ్స్, ఆయా వెబ్పేజీల్లో ఉన్న ఫొటోల ఆధారంగానే ఉంటాయని వివరించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులు మరింత ముందుకెళ్తే ఏం జరుగుతుందో చూడాలి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్