Ukraine Crisis: ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి సరైందేనా?
ఉక్రెయిన్పై రష్యా దాడిని అంతర్జాతీయ సమాజం ఖండిస్తున్నా భారత్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పలు దేశాల నుంచి ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వచ్చినా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తటస్థ వైఖరి అవలంబిస్తోంది........
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై రష్యా దాడిని అంతర్జాతీయ సమాజం ఖండిస్తున్నా భారత్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పలు దేశాల నుంచి ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వచ్చినా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. మరి, రష్యా విషయంలో భారత్ సానుకూల దృక్పథంతో ఉండటానికి కారణమేంటి? రష్యా గతంలో మనకు అండగా నిలిచిన సందర్భాలేంటి? ఉక్రెయిన్తో మన మైత్రి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే..
శాంతి చర్చలతోనే పరిష్కారమంటోన్న భారత్
ఉక్రెయిన్తో రష్యా యుద్ధం విషయంలో భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు, వినతులకు తలొగ్గకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే రష్యాకు వ్యతిరేకంగా ఐరాస చేసిన తీర్మానాలపై ఓటింగ్లో పాల్గొనకుండా భారత్ దూరంగా ఉంటోంది. మాస్కోతో ఉన్న చిరకాల స్నేహాన్ని చెదరనీయకుండా శాంతి చర్చలే సమస్యకు పరిష్కారమని సూచిస్తోంది. దౌత్యమార్గాల ద్వారానే ఇరు దేశాలూ ప్రస్తుత పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలని హితవుపలుకుతోంది. ఉక్రెయిన్పై మాస్కో దండయాత్రకు వ్యతిరేకంగా రష్యా, బెలారస్లపై అమెరికా మిత్రపక్షాలు ఐరాస భద్రతా మండలిలో తీర్మానాలను ప్రవేశపెట్టాయి. దీనికి సంబంధించి పలుమార్లు ఓటింగ్ నిర్వహించినా భారత్ ఏవైపూ మద్దతు తెలపకుండా తటస్థ వైఖరితో ఉంది. అమెరికాతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటు వేయాలని, మాస్కోపై ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేసినా భారత్ దేశ ప్రయోజనాలకే కట్టుబడి నిర్ణయం తీసుకుంది.
రష్యాతో ఎప్పట్నుంచో మంచి సంబంధాలు
భారత్కు రష్యాతో ఎంతో కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సైనిక, ఆయుధ, వాణిజ్యంతో పాటు దౌత్య సంబంధాల విషయంలో చాలా ఏళ్లుగా భారత్కు రష్యా మంచి మిత్రదేశంగా ఉంది. భారత్కు అతిపెద్ద రక్షణ, ఆయుధ సామగ్రిని సరఫరా చేసే దేశంగా రష్యా నిలిచింది. రష్యా నుంచి ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, 1300లకు పైగా టీ90 యుద్ధ ట్యాంకులను భారత్ కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి అత్యాధునిక ఎస్-400 మిసైళ్లను భారత్ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి 5బిలియన్ డాలర్లతో 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 70శాతం ఆయుధాలను రష్యా నుంచే భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం వస్తోన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి రష్యాపై భారత్ ఆంక్షలు విధిస్తే రక్షణ పరికరాల నిర్వహణ కష్టతరమవుతుంది. ఈ ఆయుధాల నిర్వహణలో స్వదేశీ పరిజ్ఞానం సాధించాలంటే భారత్కు దశాబ్దాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా విషయంలో అనుసరిస్తున్న వైఖరి మంచిదేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఏ యుద్ధంలోనూ మనకు అండగా నిలవని అమెరికా
ప్రస్తుతం ఉక్రెయిన్ విషయంలో భారత్ మద్దతు కోరుతున్న అమెరికా.. ఏ యుద్ధ సమయంలోనూ మనకు అండగా నిలవలేదు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో రష్యా భారత్కు సహకారం అందించింది. బంగాళాఖాతంలో ఓవైపు అమెరికాకు చెందిన యుద్ధనౌక 70 యుద్ధ విమానాలతోను, మరోవైపు అరేబియా సముద్రంలో బ్రిటన్కు చెందిన యుద్ధనౌక భారత్ను బెదిరింపులకు గురిచేశాయి. భారత్ విజ్ఞప్తితో ఈ యుద్ధ నౌకలు ముందుకు సాగకుండా రష్యా జలాంతర్గాములు అడ్డుకున్నాయి. పశ్చిమదేశాలు సైతం ఏ యుద్ధంలోనూ భారత్ తరఫున నిలబడిన దాఖలాల్లేవు. పైగా అణ్వస్త్రపరీక్షలు చేసినప్పుడూ ఇవి భారత్పై ఆంక్షలు విధించాయి. యుద్ధాన్ని నివారించాలంటే ఇరు దేశాలూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ, రష్యా చేస్తున్న డిమాండ్లను అమెరికాతో పాటు నాటో దళాలు తిరస్కరించడంతో దౌత్య చర్చలు అసంపూర్తిగా ముగుస్తున్నాయి. ఆపదలో ఉన్నప్పుడు భారత్కు ఏ దేశమూ అండగా నిలవలేదు. ప్రస్తుత సమయంలో ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకోవాల్సి ఉండగా.. భారత్ దానికే కట్టుబడి ఉండటం సరైందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రెండు దేశాలూ ఎప్పుడూ పాక్నే ఆదరించాయి!
దేశ విభజన వేళ బ్రిటన్ చర్యల ఫలితంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఎడతెగని వివాదం సాగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కారణంగా చైనాతో పాక్ సరిహద్దును పంచుకోవడంతో ఉపఖండంలో భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. భారత్కు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పాక్ను అమెరికా, బ్రిటన్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నాయి. రెండు అమెరికా యుద్ధ నౌకలు పాక్ నావికాదళంతో కలిసి తాజాగా యుద్ధ విన్యాసాలు చేపట్టాయి.
ఐరాసలో భారత్కు మద్దతు ఇవ్వని ఉక్రెయిన్!
ఐరాసలో అవకాశం వచ్చిన ప్రతిసారీ ఉక్రెయిన్ భారత్ను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్కు మద్దతు తెలిపింది. నాటో కూటమిలో ఉక్రెయిన్ని చేర్చుకుంటామని అమెరికా సహా పలు దేశాలు హామీ ఇచ్చాయి. కానీ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తిని నాటో దేశాలు పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాతో కలిసి ఉన్నప్పటికీ యూరోపియన్ యూనియన్లోని దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్ ఇంకా పేద దేశంగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం