- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
పతకాన్ని ఎందుకు కొరుకుతారో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడోత్సవం. అనేక దేశాలకు చెందిన అథ్లెట్లు వివిధ విభాగాల్లో పతకాల కోసం పోటీ పడుతుంటారు. జపాన్లోని టోక్యో వేదికగా మరో రెండ్రోజుల్లో జరగబోయే క్రీడల్లోనూ భారత్ తరఫున 119 క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. ఇదంతా పక్కనపెడితే.. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన విజేతలు పతకాన్ని పంటి కింద పెట్టి కొరుకుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు. మీరు అది గమనించారా? ఎందుకలా చేస్తారనే సందేహం కలిగిందా? అయితే, ఇది చదవండి..
నిజానికి, ఇలా ఒలింపిక్స్ విజేతలు పతకాన్ని కొరకడానికి ప్రత్యేక కారణం, నేపథ్యం ఏమీ లేవు. ఫొటోగ్రాఫర్లు విజేతలను ఫొటోలు తీస్తూ పోజులివ్వమని అడుగుతుంటారు. గతంలో ఓసారి ఫొటోగ్రాఫర్లు అథ్లెట్లను ఊరికే నవ్వుతూ నిలబడే కన్నా.. కాస్త భిన్నంగా పోజులివ్వమని కోరారట. అయితే, ఎవరు.. ఎప్పుడు ప్రారంభించారో తెలియదు కానీ.. ఓ అథ్లెట్ పతకాన్ని కొరుకుతూ ఇచ్చిన పోజు ఫొటోగ్రాఫర్లకు తెగ నచ్చేసింది. దీంతో అప్పటి నుంచి పతకం గెలిచిన క్రీడాకారులను ఆ విధంగా పోజివ్వమని చెప్పడం మొదలుపెట్టారు. గతంలో విజేతలు ఇచ్చిన విధంగానే ఆ తర్వాత విజేతలు పతకాన్ని కొరకడం ప్రారంభించారు. అలా ఇదో సంప్రదాయంగా మారిపోయింది. ఈ విషయంపై గతంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్ అధ్యక్షుడు డేవిడ్ వాలెచిన్స్కీ వివరణ ఇచ్చారు. ‘‘ఇది ఫొటోగ్రాఫర్లు అలవాటు చేసిందే. ఆ పోజులో క్రీడాకారుల ఫొటోలు బాగా అమ్ముడుపోతాయనే ఉద్దేశంతో ఫొటోగ్రాఫర్లు అలా చేయించి ఉండొచ్చు. అంతేకానీ.. క్రీడాకారులు స్వతహాగా పతకాన్ని కొరకాలి అనుకోరు’’అని చెప్పారు.
అయితే, ఇలా ఒక లోహాన్ని కొరకడమనేది కొన్ని శతాబ్దాల కిందటి నుంచి ఉన్నదే. పూర్వం వాణిజ్యంలో బంగారు, వెండి నాణెలు చలామణీ అయ్యేవి. బంగారు నాణెలు నిజమైనవా కావా అని తెలుసుకోవడం కోసం వర్తకులు నాణెన్ని కొరికి పరీక్షించేవారు. నాణెంపై పంటి గుర్తులు పడితే అది నాణ్యమైన బంగారం అని.. లేదంటే కల్తీ అయిందని గుర్తించేవారు. కానీ, ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని మొత్తం బంగారంతో చేయరు. వెండి పతకానికి బంగారు పూత పూస్తారు. దీంతో పతకం మందంగా, ధృడంగా కనిపిస్తుంటుంది. ఈ సారి ఏకంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి సేకరించిన లోహాలతో పతకాలను తయారు చేయడం విశేషం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Covid: దిల్లీలో కరోనా ఉద్ధృతి.. ప్రతిరోజు సగటున 8-10మంది మృతి!
-
Movies News
RRR: ఆస్కార్కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
-
India News
Bilkis Bano: ఆ దోషులను ఎందుకు విడుదల చేశారో అర్థంకావడం లేదు
-
Sports News
Test Captain : భావి భారత టెస్టు కెప్టెన్గా అతడికే ఎక్కువ అవకాశం: టీమ్ఇండియా మాజీ ఆటగాడు
-
Politics News
Nara lokesh: జగన్వి.. పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు: నారా లోకేశ్
-
Movies News
Social Look: ఆకుపచ్చ చీరలో అనసూయ ‘సందడి’.. ప్రియాంక చోప్రా సర్ప్రైజ్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్టొట చేరిన నిఘా నౌక..!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Karthikeya 2: కృష్ణతత్వం వర్కవుట్ అయింది.. నార్త్కు నచ్చేసింది!
- Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!