మహా మహా మాయగాళ్లు..కరీబియన్కే ఎందుకు?
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో మెహుల్ ఛోక్సీ నిందితుడు. భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వాలో తలదాచుకున్న ఆయన, ఉన్నట్టుండి మే 23న అదృశ్యమయ్యాడు...
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో మెహుల్ ఛోక్సీ నిందితుడు. భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వాలో తలదాచుకున్న ఆయన, ఉన్నట్టుండి మే 23న అదృశ్యమయ్యాడు. క్యూబా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో డొమినికా సముద్ర తీరంలో పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అసలు.. భారత్ నుంచి తప్పించుకున్న ఛోక్సీ కరీబియన్ దీవుల్లోని ఆంట్విగాకే ఎందుకు వెళ్లాడు? ఒక్క మెహుల్ ఛోక్సీనే కాదు.. ఐపీఎల్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లలిత్ మోదీ లాంటి పెద్దపెద్ద నిందితులెందరో దేశం నుంచి పారిపోయి కరీబియన్ దీవుల్లోనే తలదాచుకుంటున్నారెందుకు?వాళ్లందరికీ ఆ దీవులు పూలపాన్పులా ఎందుకు తయారయ్యాయి?
కరీబియన్ దీవుల్లో ఆంటిగ్వా, బార్బడోస్, డొమినికా, గ్రెనడా, సెయింట్ కిట్స్, సెయింట్ లూసియా తదితర చిన్న చిన్న దేశాలున్నాయి. ద్వితీయ పౌరసత్వం కావాలకున్న విదేశీయులకు ఇవి ఎర్ర తివాచీ పరుస్తాయి. ఆయా దేశాల్లో కొంత మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు. సులభంగా ఆ దేశ పౌరసత్వం పొందొచ్చు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 150-165 దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆ జాబితాలో ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఉండటం గమనార్హం. అందువల్లే భారత్లో భారీ మోసాలకు పాల్పడ్డ నిందితులు.. కొంత మొత్తంలో అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ దేశ పౌరసత్వం పొందుతున్నారు. సరైన సమయం చూసుకొని అక్కడికి ఎగిరిపోతున్నారు. స్థానిక పౌరసత్వం ఉన్న కారణంగా వారికి రాజ్యాంగ పరమైన రక్షణ ఉంటుంది. భారతదేశ చట్టాలు అక్కడ పని చేయకపోవడం వల్ల వారిని పట్టుకోవడం అధికారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతోంది.
పెట్టుబడులతో పౌరసత్వం
కరీబియన్ దేశాలు అనుసరిస్తున్న పెట్టుబడులతో పౌరసత్వం విధానం కింద 2014 నుంచి ఇప్పటి వరకు 28 మంది భారతీయులు ఆంటిగ్వా పౌరసత్వం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 2017, జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య కాలంలో 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఏడుగురికి పౌరతస్వం ఇచ్చినట్లు ఆంటిగ్వా ప్రకటించింది. ఈ వ్యవహారాలను నిర్వహించేందుకు ఆ దేశంలో ఏకంగా ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖే ఉండటం గమనార్హం. 2014-2019 మధ్య కాలంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆంటిగ్వా జులై 2013లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. డిసెంబర్ 31, 2019 వరకు వివిధ దేశాలకు చెందిన 2,240 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో అనేకమందికి ఆ దేశం పౌరసత్వం ఇచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం 2019లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
సెయింట్ కిట్స్దీ అదే దారి
కరీబియన్ దీవుల్లోని మరో దేశమైన సెయింట్ కిట్స్ 1983లో ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్యం పొందింది. స్వతంత్ర దేశమైన ఏడాది తర్వాత, అంటే ఆంటిగ్వా కంటే ముందుగానే, 1984లోనే ఈ వివాదాస్పదమైన పెయిడ్ సిటిజన్షిప్ విధానాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో వీసాలు లేకుండా ప్రయాణం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పడంతో బడాబడా వ్యాపారస్థులు కొంతమొత్తంలో అక్కడ పెట్టుబడి పెట్టి పౌరసత్వం తీసుకున్నారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. కేవలం పౌరసత్వం మాత్రమే కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యక్ష పన్ను, మూలధన లాభాలపై పన్ను, డివిడెండ్లపై పన్ను లేకపోవడంతో చాలామంది వ్యాపారవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు.
పౌరసత్వం మరీ ఇంత తేలికా..!
కరీబియన్ దేశాల పౌరసత్వం పొందడం ఎంత తేలికో అని కొన్ని అంశాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. డొమినికా, సెయింట్ లూసియా పౌరసత్వం పొందాలంటే ఒక వ్యక్తి లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే చాలు. ఆ వ్యక్తితోపాటు ఆయన భార్యకు కూడా పౌరసత్వం కావాలంటే సెయింట్ లూసియాలో 1.65 లక్షల డాలర్లు, డొమినికాలో అయితే 1.75 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చైనాలో వ్యాపారం చేయాలనుకుంటే నేరుగా ఆ దేశ పౌరుడై ఉండక్కర్లేదు. 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కరీబియన్ దేశమైన గ్రెనడా పౌరసత్వం తీసుకుంటే చాలు. ఆ పాస్పోర్టుతో కొన్ని యూరప్ దేశాలతోపాటు, చైనాకు కూడా వీసా లేకుండా వెళ్లిపోవచ్చు.
ఈ వెసులుబాటునే ఆసరాగా చేసుకొని మహా మహా మాయగాళ్లంతా కరీబియన్ దీవులనే అడ్డాగా మార్చుకుంటున్నారు. తమ సొంత దేశాల్లో దోచుకున్న డబ్బులో కొంత పెట్టుబడి పెట్టి, అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారు. అలా ఆర్థిక నేరగాళ్లు భారత్ కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నారు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్
పొరుగు దేశాలతో భారత సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రశంసలు కురిపించింది. -
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
Chandrayaan: చంద్రుడి ఉపరితలంపై భారతీయుడు అడుగు పెట్టేవరకు భారత జాబిల్లి యాత్రలు కొనసాగుతాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. -
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. -
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ
తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. -
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. -
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్