Afghanistan: కరవు.. కరోనా.. పోలియో.. ఆపై తాలిబన్లు..!
అఫ్గాన్ జాతీయుల పరిస్థతి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటికే ఆ దేశంలో మూడోంతుల ప్రాంతం తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం..
* దయనీయంగా మారిన అఫ్గానిస్థాన్ వాసుల జీవితాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అఫ్గాన్ జాతీయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఇప్పటికే ఆ దేశంలో మూడువంతుల ప్రాంతం తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం.. వ్యాక్సిన్ల లభ్యత తగ్గిపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచునకు చేరాయి. తాజాగా పాలనా పగ్గాలు తాలిబన్లు చేపట్టడంతో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వారు ఇప్పటికే పోలియో టీకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇక కరోనా టీకాలను కూడా దేశంలోకి రానీయరనే భయాలు ఉన్నాయి.
దేశం మొత్తం కరవు కోరల్లో..
అఫ్గానిస్థాన్లో కరవు నెలకొన్నట్లు జూన్ 22వ తేదీన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ అండ్ రెడ్క్రాస్ సొసైటీస్ ప్రకారం దేశంలో 30శాతం భూభాగంలో అత్యంత తీవ్రమైన కరవు నెలకొంది. 50శాతం తీవ్రమైన కరవు ఉండగా.. మరో 20శాతం భూభాగంలో ఓ మోస్తరు కరవు నెలకొంది. దేశంలోని గోధుమల ఉత్పత్తి రెండు మిలియన్ టన్నులకు పడిపోగా.. మూడు మిలియన్ల పశువులు, ఇతర జీవాలు మృత్యువు ముంగిట నిలిచాయి.
యూఎస్ ఎయిడ్ ఏప్రిల్2020లో ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రజలకు ఆహారం లభించని పరిస్థితి నెలకొంది. అఫ్గాన్ జనాభాలో సగం మంది కటిక పేదరికంలో ఉన్నారని పేర్కొంది. వీరిలో 11 మిలియన్ల మందికి ఆహారం కూడా అందడంలేదని వెల్లడించింది. గతేడాది న్యూట్రిషియన్ క్లస్టర్ లెక్కల ప్రకారం 3.5మిలియన్ల మంది బాలింతలు, పసిపిల్లల్లో పోషక లోపాలు ఉన్నాయని పేర్కొంది.
విజృంభిస్తున్న కొవిడ్..
ఇక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే.. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది జులై వరకు కేవలం 5,00,000 పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. వీటిల్లో 1,51,770 పాజిటివ్లు వచ్చాయి. ఇక్కడ పాజిటివిటీ రేటు 42శాతం ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది.
ఆగస్టు 13 నాటికి 7వేల మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆగస్టులో కేసులు తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ, సంక్షోభ సమయంలో ఇక్కడ ఏమేరకు పరీక్షలు జరుగుతున్నాయనేది అనుమానాస్పదమే.
డౌన్టు ఎర్త్లెక్క ప్రకారం దేశంలో మొత్తం 18లక్షల డోసుల కొవిడ్ టీకాలను మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ చేశారు. గత నెలలలో కోవ్యాక్స్ కార్యక్రమం కింద జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ నుంచి 14లక్షల టీకాలు దేశానికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకొన్నవారి సగటు రేటు 23.6శాతం ఉంటే.. అఫ్గానిస్థాన్లో అది 0.6శాతం వరకు ఉంది.
గతవారం తాలిబన్లు పక్తియా ప్రావిన్స్లో కొవిడ్ టీకాల కార్యక్రమాన్ని బ్యాన్ చేశారు. ఇటీవల వారు గుంపులుగా అధ్యక్ష భవనంలోకి చొరబడినప్పుడు ఒక్కరు కూడా మాస్కు ధరించి లేరు. తాలిబన్ల ఆక్రమణతో చాలా మంది వలస పోతుండటంతో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం ఉంది. ఫలితంగా పొరుగున ఉన్న పాక్,ఇరాన్ వంటి దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది.
పోలియో చుక్కలపై తాలిబన్లకు పగ..!
ప్రపంచంలో పోలియో వైరస్ ఇంకా చురుగ్గా ఉన్నదేశాలు రెండే ఉన్నాయి. వాటిల్లో అఫ్గానిస్థాన్ కూడా ఒకటి. 2020లో ఇక్కడ 56 పోలియో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు వరుసగా మూడేళ్లపాటు రాకుండా ఉంటేనే పోలియో రహిత దేశంగా ప్రకటిస్తారు. అఫ్గానిస్థాన్ పోలియో నిర్మూలన యాక్షన్ ప్లాన్ (ఎన్ఈఏపీ) ప్రకారం తాలిబన్ ఆధీనంలోని ప్రాంతాల్లో పోలియో నిర్మూలన కార్యక్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇక్కడ ఇంటింటికి తిరిగి టీకాలు వేయడంపై మూడేళ్లుగా నిషేధం అమల్లో ఉంది.
ఈ ఏడాది జూన్లో నాన్గ్రాహర్ ప్రావిన్స్లో పోలియో వ్యాక్సిన్ వేసే కార్యకర్తలను తాలిబన్లు కాల్చి చంపారు. ఇక ఏప్రిల్లో జలాలాబాద్లో ముగ్గురు మహిళా ఆరోగ్య కార్యకర్తలను హత్య చేశారు. భద్రతా పరమైన కారణాలతో పోలియో నిర్మూలన కార్యక్రమ వేగం మందగించడంతో మిలియన్ల కొద్దీ పిల్లలకు టీకాలు లభించలేదని లాన్సెన్స్ పత్రిక పేర్కొంది.
తాజాగా అమెరికా సేనలు అఫ్గానిస్థాన్ను వీడిపోవడంతో దాదాపు 30 ఏళ్ల నుంచి చేపట్టిన పోలియో నిర్మూలన కార్యక్రమం కుంటుపడే ప్రమాదం నెలకొంది. 2021లో ఇప్పటి వరకు ఒక పోలియో కేసు వచ్చింది. కానీ, ఇప్పుడు అఫ్గాన్లోని పరిణామాలు వ్యాక్సినేషన్ను మందగింపజేస్తాయని యేల్ విశ్వవిద్యాలయ ఎపిడమాలజిస్టు సాద్ బి ఒమర్ పేర్కొన్నారు. అఫ్గాన్తోపాటు పోలియో కేసులు నమోదవుతున్న మరో దేశం పాకిస్థాన్.. భూమిపై ఈ రెండు దేశాల్లోనే పోలియో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..