Lalit Modi: రాహుల్ గాంధీపై దావా వేస్తా: లలిత్ మోదీ
రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై తాను యూకే కోర్టుకు వెళ్తాలని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) హెచ్చరించారు. ‘మోదీ’ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న సమయంలో లలిత విమర్శలు చేయడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఇలాంటి సమయంలో ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi).. రాహుల్పై తీవ్రంగా మండిపడ్డారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు గానూ.. కాంగ్రెస్ నేతపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో రాహుల్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
‘‘నేను న్యాయప్రక్రియ నుంచి పారిపోయానని గాంధీ మద్దతుదారులు, ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు? ఎలా? రాహుల్ గాంధీ మాదిరిగా.. ఇప్పటివరకు నేను ఏ కేసులోనైనా దోషిగా తేలానా? ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేక.. ఇలా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు సామాన్య పౌరుడు కూడా అర్థం చేసుకోగలడు. ఈ తప్పుడు ఆరోపణలకు గానూ రాహుల్కు వ్యతిరేకంగా నేను యూకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అప్పుడైనా ఒక బలమైన ఆధారాలతో రావాల్సి ఉంటుంది. అవి దొరక్క ఆయన ఫూల్ అవడం నేను చూస్తాను. గాంధీ కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది కాంగ్రెస్ నేతలకు విదేశాల్లో ఆస్తులున్నాయి. మీ అసత్య ఆరోపణలతో ప్రజలను తెలివితక్కువ వారిని చేయలేరు. తాము మాత్రమే ఈ దేశాన్ని పాలించేందుకు అర్హులమని గాంధీ కుటుంబం భావిస్తోంది’’ అని లలిత్ మోదీ (Lalit Modi) ఘాటు విమర్శలు చేశారు.
‘‘గత 15 ఏళ్లలోనే నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా దోచుకున్నట్లు ఇప్పటివరకు నిరూపణ కాలేదు. అయితే, నిజమేంటంటే.. దాదాపు 100 బిలియన్ డాలర్లను సంపాదించి పెట్టిన ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రీడా టోర్నీని నేను నిర్వహించాను. 1950 నుంచి కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన దానికంటే ఎక్కువగా, వారి ఊహలకు మించి ‘మోదీ’ కుటుంబం (ఆ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ) ఈ దేశానికి సేవ చేసింది. నేను కూడా ఎక్కువే చేశాను. నేను దోచుకున్నానని మీరు ఎంత అరిచినా లాభం లేదు. ఇక భారత్లో కఠినమైన చట్టాలను తీసుకొచ్చిన తర్వాత నేను తప్పకుండా తిరిగొస్తాను’’ అని మోదీ రాసుకొచ్చారు.
ఐపీఎల్ కుంభకోణంలో లలిత్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్నారు. ఈ స్కామ్లపై గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రాహుల్.. ఆ మధ్య ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో? అని వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త తీవ్ర దుమారం రేపడంతో పాటు ఆయనపై పరువునష్టం కేసు కూడా దాఖలైంది. ఈ కేసులో ఇటీవల విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్పై లలిత్ మోదీ విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!