వీకెండ్లో అనవసరంగా తిరిగితే చర్యలే..!
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే...
తిరువనంతపురం: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నెల 24, 25 తేదీల్లో కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేస్తాయని కొవిడ్ ప్రత్యేక పర్యవేక్షణ బృందానికి నేతృత్వం వహిస్తున్న డీఐజీ కె. సంజయ్ కుమార్ గురుదిన్ వెల్లడించారు. ఈ నెల 24న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు రోజుల్లో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. అత్యవసర సర్వీసులు, కార్యకలాపాలకు సంబంధించిన ప్రయాణాలకు ఆయా వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకోవచ్చని, వేడుకల్లో పాల్గొనేందుకు 12 మందికి మాత్రమే అనుమతిచ్చింది. అలాగే, కొవిడ్ నింధనలను కఠినంగా పాటించాలని సూచించింది.
చండీగఢ్లో వీకెండ్ లాక్డౌన్ లేదు..
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో వీకెండ్ లాక్డౌన్ లేదని అధికారులు వెల్లడించారు. కేవలం రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే ఉంటుందని తెలిపారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నిర్ణీత రోజుల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్లోనూ ఉచితంగానే టీకా
కరోనా విజృంభణ వేళ 18 నుంచి 45 ఏళ్ల వరకు అందరికీ ఉచితంగానే టీకా పంపిణీ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం తీరత్సింగ్ రావత్ వెల్లడించారు. మే తొలి వారంలో ఈ టీకా పంపిణీ జరుగుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ఉచితంగానే వేయనున్నట్టు తెలిపారు. ఆ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు.
నిత్యావసరాల పంపిణీపై కంట్రోల్ రూమ్
దేశంలో అంతర్గత వాణిజ్యం, నిత్యావసరాల ఉత్పత్తులు, పంపిణీని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వస్తువుల సమీకరణలో తలెత్తే సమస్యల పరిష్కారం, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించవచ్చని కేంద్ర మంత్రి పీయూష్గోయల్ వెల్లడించారు. నిత్యావసరాలు, అత్యవసరాల తయారీ, రవాణాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది. +91 11 23062383, 23062975 నంబర్లు రేపట్నుంచి ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పనిచేస్తాయని, dpiit-controlroom@gov.inకు మెయిల్ కూడా చేయవచ్చని తెలిపారు.
రేపట్నుంచి అందుబాటులోకి ధన్వంతరి ఆస్పత్రి..
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ధన్వంతరి కొవిడ్ ఆస్పత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. ఈ ఆస్పత్రి రేపట్నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, హోంశాఖ చొరవతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీంట్లో 950 పడకలు, 250 ఐసీయూ పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం