కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?
కరోనా వైరస్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. వ్యాక్సిన్ రాకతో సాధారణ జీవితంపై సర్వత్రా ఆశలు చిగురించాయి. ఈ తరుణంలో వైరస్ కొత్త రూపు సంతరించుకుంటోందన్న వార్తలు కలవరపెడుతున్నాయి.......
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ముప్పు నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. వ్యాక్సిన్ రాకతో సాధారణ జీవితంపై సర్వత్రా ఆశలు చిగురించాయి. ఈ తరుణంలో వైరస్ కొత్త రూపు సంతరించుకుంటోందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాలో రెండు రకాల కొత్త కరోనా వైరస్లను గుర్తించారు. దీంతో ఆయా దేశాల్లో రెండో దశ వ్యాప్తి ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా లాక్డౌన్ విధించింది. క్రిస్మస్ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే ఐరోపా దేశాలు బ్రిటన్ నుంచి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.
కొత్త రకం వివరాలివే..
కరోనా పుట్టుక నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా రూపాంతరం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. తాజాగా బ్రిటన్లో గుర్తించిన వీయూఐ-202012/01(VUI-202012/01) మాత్రం అందరినీ అప్రమత్తం చేస్తోంది. సాధారణ కరోనా వైరస్ కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. లండన్లో తాజాగా వెలుగులోకి వస్తున్న కొత్త కేసుల్లో అత్యధికం ఈ రకం సంక్రమణ వల్లేనని గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు కూడా తెలియజేశారు. తద్వారా మిగతా దేశాల్ని అప్రమత్తం చేశారు. అయితే, ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ కొవిడ్ తీవ్రతను పెంచుతున్నట్లు.. మరణాల రేటును పెంచుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక దక్షిణాఫ్రికాలో గుర్తించిన 501.వీ2 వైరస్ యువకుల్లో వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.
రూపాంతరం అంటే..
వైరస్ జన్యుక్రమంలో చోటుచేసుకునే మార్పులనే రూపాంతరం చెందడం అంటారు. వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించగానే.. తనకు అనువైన కణానికి అతుక్కొని లోపలికి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో మన రోగనిరోధక శక్తి దానితో పోరాడి అడ్డుకుంటుంది. ఈ క్రమంలో శరీరంలో తన మనుగడకు అనుకూలంగా వైరస్ రూపాంతరం చెందుతుంది. ఇప్పటి వరకు గుర్తించిన వేలాది రూపాంతరాలు అంత ప్రమాదకరమైనవేమీ కాదని తేల్చారు. తాజాగా బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకాలతో పాటు గతంలో గుర్తించిన 4614జీ కొంత అప్రమత్తతకు గురిచేశాయి. ఇలా పలు దేశాల్లో అనేక వైరస్ రకాలను గుర్తించారు. ఒక్క డెన్మార్క్లోనే ఏడు రకాల వైరస్లను నిర్ధరించారు.
తాజా వ్యాక్సిన్లు కొత్త వాటిపై పనిచేస్తాయా?
ఇప్పటికే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు కొత్త వైరస్లను సమర్థంగా ఎదుర్కొంటాయా అన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఇది వైరస్ రూపాంతరంపై ఆధారపడి ఉంటుందని కింగ్స్ కాలేజ్కు చెందిన ప్రొఫెసర్ స్ట్వార్ట్ నీల్ తెలిపారు. వైరస్ కొమ్ము భాగంలో మార్పు వస్తే మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాజా వ్యాక్సిన్లలో అత్యధికం ఈ కొమ్ము భాగాల పనితీరును దెబ్బతీయడమే లక్ష్యంగా రూపొందించినవని వివరించారు. మరోవైపు ప్రస్తుతం అభివృద్ధి చేసిన టీకాలన్నీ కరోనా వైరస్ రూపాంతరాల్ని సమర్థంగా ఎదుర్కొంటాయని కొంతమంది వైద్య నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైరస్లో ముఖ్యంగా కొమ్ము భాగంలోనే మార్పులు వస్తున్నాయని తెలిపారు. కానీ, టీకాలు మాత్రం ఈ కొమ్ములతో పాటు వైరస్ ఇతర భాగాల పనితీరునూ దెబ్బతీసేలా రూపొందించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీకాలు ఎలాంటి కరోనా వైరస్నైనా సమర్థంగా ఎదుర్కొంటాయని వివరించారు. జర్మనీ ఆరోగ్య మంత్రి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కొత్త రకం వైరస్నూ వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కోగలవని ఐరోపా సమాఖ్యకు చెందిన వైద్య నిపుణులు తెలిపారని వివరించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..