Bank Robbery: దొంగపై మహిళా మేనేజర్ ఎదురుదాడి
రాజస్థాన్ శ్రీగంగానగర్లోని రాజస్థాన్ మరుధర గ్రామీణ బ్యాంకులో చోరీకి వచ్చి దొరికిపోయాడు ఓ దొంగ. శనివారం పదునైన ఆయుధంతో లోపలకు ప్రవేశించిన దొంగను బ్యాంకు సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
జైపుర్: రాజస్థాన్ శ్రీగంగానగర్లోని రాజస్థాన్ మరుధర గ్రామీణ బ్యాంకులో చోరీకి వచ్చి దొరికిపోయాడు ఓ దొంగ. శనివారం పదునైన ఆయుధంతో లోపలకు ప్రవేశించిన దొంగను బ్యాంకు సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కత్తి పట్టుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన దొంగను.. మహిళా మేనేజర్ పూనమ్ గుప్తా అడ్డుకున్నారు. కటింగ్ప్లైయర్ పట్టుకుని ఎదురుదాడికి దిగారు. దీంతో పరుగు అందుకున్న దొంగను ఇతర సిబ్బంది పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ బ్యాంకు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దొంగను ద్వాడా కాలనీకి చెందిన 29 ఏళ్ల లావిశ్గా పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు