airindia: విమానంలోకి అనుమతించలేదని..!
ఆలస్యంగా వచ్చినందుకు విమానంలోకి అనుమతించలేదని ఓ మహిళ బాధతో నేలపై పడి రోదించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దిల్లీ ఎయిర్ పోర్టులో
ఇంటర్నెట్డెస్క్: ఆలస్యంగా వచ్చినందుకు విమానంలోకి అనుమతించలేదని ఓ మహిళ బాధతో నేలపై పడి విలపించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి మేనల్లుడు మాట్లాడుతూ.. తాము 5 నిమిషాలు ఆలస్యంగా వస్తామని సిబ్బందికి ముందే సమాచారం అందించామని పేర్కొన్నారు. తన అత్తకు డయాబెటిక్, గుండెజబ్బులు ఉన్నాయని.. అందుకే ఆమె పరిగెత్తలేదని వివరించాడు. అంతేకాదు వాళ్లు తమతోపాటు, ముందుగా సమాచారం అందించి వచ్చిన వారిని వెళ్లనీయకుండా గేట్లు మూసేశారని ఆరోపించాడు. వాస్తవానికి విమానం ఆ తర్వాత అర్ధగంటకుగానీ ప్రయాణం ప్రారంభించలేదని పేర్కొన్నాడు. ఈ ఘటనతో తమ మేనత్త తీవ్రమైన బాధతో కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ సమయంలో వైద్యసాయం చేయకుండా.. సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి తమను ఎగ్జిట్ గేటు వద్ద వదిలి రమ్మని పురమాయించినట్లు ఆరోపించాడు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సర్క్యూలేట్ అవుతున్న ఆ వీడియో ఎయిర్ ఇండియా ఇమేజ్ను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వెల్లడించింది. వాస్తవాలు తెలుసుకోకుండా.. తమ వివరణ కోరకుండా కొందరు ఈ వీడియోను పోస్టు చేశారని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత, సమయానికి గమ్యస్థానాలకు చేర్చడమే ఎయిర్ ఇండియా అత్యున్నత ప్రాధాన్యాలని వివరించింది. ఈ వీడియోలోని ముగ్గురు ప్రయాణికులు బోర్డింగ్ గేట్లను మూసివేసిన తర్వాత రిపోర్టు చేశారని వెల్లడించింది. ఆ మహిళ బోర్డింగ్ గేటు వద్ద పడిపోగా.. డాక్టర్, సీఐఎస్ఫ్ సిబ్బందిని పిలిపించామని చెప్పింది. కానీ, ఆ మహిళ కోలుకొని వీల్ఛైర్గానీ, వైద్య సదుపాయాలుగానీ స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు