womens reservation bill: ‘ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు..!’ మహిళా బిల్లుపై ఎవరేమన్నారంటే..?
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో నేడు వాడీ వేడీ చర్చ జరిగింది. అధికార, విపక్షాలు పరస్పరం వాదోపవాదాలకు దిగాయి. మరి ఈ బిల్లుపై ఎవరు ఏమన్నారంటే..?
దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)పై లోక్సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ఈ బిల్లుపై మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్కు ముందే ఈ రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు.. ‘ప్రత్యేక’ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని నిలదీశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు అటు అధికారపక్ష ఎంపీలు కూడా దీటుగానే బదులిచ్చారు. మరోవైపు, చర్చ సందర్భంగా అధికార, విపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు: సుప్రియా సూలే
ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి భాజపా ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు గుప్పించారు. మహిళలను తక్కువ చేయాలని చూస్తున్న వారికి ‘ఇండియా’ కూటమి మద్దతు పలుకుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తీవ్రంగా స్పందించారు. ‘‘గతంలో మహారాష్ట్రలో భాజపాకు చెందిన ఓ నేత ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన ఓసారి నాతో మాట్లాడుతూ.. ‘సూలేజీ మీరు ఇంటికెళ్లి వంట చేసుకోండి.. దేశ వ్యవహారాలు మేం చూసుకుంటాంలే’ అని అన్నారు. ఇది భాజపా ఆలోచనా విధానం. మహిళా చట్టసభ్యుల పట్ల భాజపా నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసేవారు’’ అని సుప్రియా సూలే దుయ్యబట్టారు.
మాకు సెల్యూట్ అక్కర్లేదు: కనిమొళి
‘‘ఇది కేవలం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు మాత్రమే కాదు.. అసమానతలు, పక్షపాత ధోరణిని తొలగించే బిల్లు. అయితే, దీన్ని జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని బిల్లులో పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకెంతకాలం ఎదురుచూడాలి. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియమ్ అని పేరు పెట్టారు. మాకు సెల్యూట్ చేసి వందనాలు చేయనక్కర్లేదు. పీఠాలు వేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు. సమానంగా గౌరవిస్తే చాలు’’ అని కనిమొళి (Kanimozhi) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె శక్తిమంతమైన మహిళ అని అంగీకరించడానికి నాకు ఎలాంటి సంకోచాల్లేవు’’ అని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజీవ్ గాంధీ కల నెరవేరింది: సోనియా గాంధీ
రెజ్లర్లను వేధించిన ఎంపీపై చర్యలేవీ: తృణమూల్ ఎంపీ
‘‘ఎన్నికల ముందు ఈ బిల్లును తీసుకురావడం పూర్తిగా భాజపా గిమ్మిక్కే. నిజంగా వారికి మహిళలంటే గౌరవం ఉంటే అది చేతల్లో చూపించాలి. మహిళలను వేధించిన, వారిని అగౌరవపర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటల్లో బంగారు పతకాలతో విశ్వ వేదికపై మన దేశ ప్రతిష్ఠను పెంచిన క్రీడాకారిణులు తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కారు. కానీ, అందుకు బాధ్యులైన వారు (భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ను ఉద్దేశిస్తూ) ఇక్కడే కూర్చున్నారు. మహిళా సాధికారతపై మీరు నిజంగా దృష్టిసారిస్తే.. ఆ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోష్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
స్మృతి ఇరానీ మండిపాటు.
ఇదిలా ఉండగా.. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఉండాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. కులాల వారీగా కోటా అడుగుతూ విపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక, రిజర్వేషన్లపై బిల్లును తాము ముందుగా తెచ్చామంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘సక్సెస్ను తమ ఖాతాలో వేసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అదే ఓటమి ఎదురైతే ఎవరూ రారు. అందుకే, కొందరు ఈ బిల్లును తమదని చెబుతున్నారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోనియా, రాహుల్ ఆదాయపన్ను మదింపు కేసు 13కు వాయిదా: సుప్రీంకోర్టు
తమ ఆదాయపు పన్ను మదింపు వ్యవహారాన్ని సెంట్రల్ సర్కిల్కు బదిలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు; ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. -
10, 12 తరగతుల ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: సీబీఎస్ఈ
పది, పన్నెండు తరగతుల పరీక్షల ఫలితాలకు సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన వెలువరించింది. -
నేవీ నౌకకు తొలి మహిళా కమాండింగ్ అధికారి
‘అన్ని ర్యాంకులు, అన్ని పాత్రల్లో మహిళా సిబ్బందికి అవకాశం’ అన్న సూత్రానికి అనుగుణంగా నేవీ ఓడలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తెలిపారు. -
వాస్తవాలను మరుగుపరుస్తున్న నకిలీ వార్తలు
నకిలీ వార్తలు వెల్లువలో వాస్తవ సమాచారం మరుగునపడిపోతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
గ్రీన్ క్రెడిట్స్ కార్యక్రమానికి మోదీ శ్రీకారం
బంజరు భూముల్లో మొక్కల పెంపకం ద్వారా గ్రీన్ క్రెడిట్స్ను పొందడంపై దృష్టిసారించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కాప్28లో శ్రీకారం చుట్టారు. -
హెచ్ఐవీ పాజిటివ్ టీనేజర్లతో కోల్కతాలో దేశంలోనే తొలి కేఫ్
పశ్చిమబెంగాల్ రాజధాని నగరంలోని సౌత్ కోల్కతాలో 14 మంది టీనేజర్లు ‘కేఫ్ పాజిటివ్’ పేరుతో ఓ కాఫీ షాపు నడుపుతున్నారు. -
రూ.4,950 విద్యుత్తు బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు!
నెలనెలా విద్యుత్తు బిల్లు కట్టేటప్పుడు చెల్లించిన మొత్తానికి సిబ్బంది రసీదు ఇస్తారు. ఒకవేళ చిల్లర లేదని ఎక్కువగా చెల్లిస్తే.. తర్వాతి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. -
ఇదేం పెళ్లిరా బాబూ!
బిహార్లోని వైశాలి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు. -
మొయిత్రా బహిష్కరణపై ఎథిక్స్ కమిటీ సిఫార్సు 4న లోక్సభ ముందుకు
ప్రశ్నలు అడిగినందుకు డబ్బు’ వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సు లోక్సభ ముందుకు రానుంది. -
అటవీ భూముల లీజుకు కొత్త నిబంధనలు
అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. -
కళాశాలల్లో సెల్ఫీ పాయింట్లు
వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది. -
బాధితుణ్ని నిందితుడిగా మార్చే కుట్ర
బాధితుడినైన తనపై కల్పిత అభియోగాలు మోపి నిందితుడిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. -
బీఎస్ఎఫ్ పరిధి పెంపు కోసం పంజాబ్ పోలీసుల అధికారాన్ని హరించరాదు
అంతర్జాతీయ సరిహద్దుల వెంట తనిఖీలు, జప్తులు, అరెస్టులకు సంబంధించి బీఎస్ఎఫ్ అధికార పరిధిని 50 కి.మీ. వరకు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ పోలీసుల అధికారాలను హరించేలా ఉండరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
స్టే ఉత్తర్వుల గడువుపై పునఃపరిశీలన
సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రత్యేకంగా పొడిగిస్తే తప్ప, ఆ ఉత్తర్వులకు ఆరు నెలల్లో గడువు తీరిపోతుందని 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. -
చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు
చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్న భారత్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి కోడెక్స్ ఏలిమెంటేరియస్ కమిషన్ (సీఏసీ) ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. -
సంపూర్ణ సురక్షితంగా పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులు
పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులను రానున్న రెండేళ్లలో చొరబాట్లకు వీల్లేని విధంగా పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
సిల్క్యారా సొరంగంలో కలిసికట్టుగా కార్మికులు
ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీలో సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు నీటిపైపుల ద్వారా తమ సమాచారాన్ని అధికారులకు తెలిపినట్లుగా ఆ ప్రమాదంలో చిక్కుకున్న సంతోష్ అనే ఓ కార్మికుడు తెలిపారు. -
ఈ సారి చలి తీవ్రత తక్కువే!
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
అంతర్జాతీయ నేరాలను కలిసికట్టుగా అరికడదాం
అంతర్జాతీయ నేరాలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని భారత్ పిలుపు ఇచ్చింది. -
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
గుజరాత్లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా చనిపోయిన 1052 మందిలో 80శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!