Helicopter Crash: రావత్ ప్రమాదంపైఏ చిన్న ఆధారాన్నీవదిలిపెట్టం
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఎయిర్ చీఫ్
ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి
హైదరాబాద్: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి తెలిపారు. ఈ ప్రమాదందలో ఏ చిన్న ఆధారానీ వదిలిపెట్టబోమని అన్నారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్కు వాయుసేనాధిపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హెలికాప్టర్ ప్రమాదం గురించి ప్రస్తావించారు.
‘‘సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వాతావరణ తప్పిదమా..? మానవ తప్పిదమా..? లేక సాంకేతిక లోపమా? అనేది విచారణ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతున్నందున దీనిపై ఇప్పుడే ఏం మాట్లాడలేం. ఈ ఘటనపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టబోం. ఘటనాస్థలంలో దొరికిన ప్రతి ఆధారాన్ని పరిశీలించాలి. ప్రతి సాక్షిని విచారించాలి. ఇందుకోసం వారాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇస్తున్నా’’ అని చౌధరి వెల్లడించారు. తమిళనాడు హెలికాప్టర్ ఘటన నేపథ్యంలో వీవీఐపీ ప్రొటోకాల్స్ను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని వాయుసేనాధిపతి తెలిపారు. ఈ ఘటన దర్యాప్తు నివేదిక ఆధారంగా వీటిని సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.
సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయి..
ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితుల గురించి వీఆర్ చౌధరి మాట్లాడారు. పాకిస్థాన్, చైనా నుంచి సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయని, వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం అక్కడ యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కేవలం యుద్ధం వైపే కాకుండా సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్లను దీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించేలా క్యాడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో డ్రోన్ దాడులు సవాల్గా మారాయని, ఇందుకోసం యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా