టీకా పంపిణీ: 100 కోట్ల డోసులు పూర్తి!
ప్రపంచంలో 172 దేశాల్లో టీకా అందుబాటులోకి రాగా ఆయా దేశాల్లో ఇప్పటివరకు 100కోట్ల డోసులను పంపిణీ చేశారు.
143 రోజుల్లోనే 100కోట్ల మార్క్
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచంలో 172 దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు 100కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో ప్రపంచ జనాభాలో దాదాపు 6.6శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా పంపిణీలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వీటిని అధిగమించేందుకు ఆయా దేశాలు కృషిచేస్తున్నాయి.
143 రోజుల్లోనే ఈ ఘనత..
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోన వైరస్ మహమ్మారిపై జరుగుతోన్న పోరులో యావత్ ప్రపంచం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా అనతికాలంలోనే కొవిడ్-19ని ఎదుర్కొనే టీకాను తయారు చేయడంతో పాటు వాటి పంపిణీని అంతే వేగంతో చేపడుతోంది. గతేడాది డిసెంబర్ 2వ తేదీన ఫైజర్ టీకా వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపిన తొలి దేశంగా నిలిచింది. డిసెంబర్ 8, 2020 రోజున వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించింది. తొలి టీకా తీసుకున్న మహిళ మార్గరెట్ కీనన్(90ఏళ్లు) అనే బ్రిటన్ మహిళ రికార్డు సృష్టించారు. అలా మొదలైన వ్యాక్సిన్ పంపిణీ ప్రయాణం.. ఐదు నెలలు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల డోసులను పంపిణీ చేయగలిగారు. వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపిన 143 రోజుల్లోనే (ఏప్రిల్ 24నాటికి) వందకోట్ల మార్కును దాటడం విశేషం. ఇప్పటి వరకు పంపిణీ అయిన 100కోట్ల డోసుల్లో కొందరు తొలి డోసు తీసుకోగా, మరికొందరు రెండు డోసులను తీసుకున్నారు.
టీకా పంపిణీని అత్యధిక వేగంగా చేపడుతోన్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే ముందుంది. ఇప్పటివరకు అక్కడ 22కోట్ల డోసులను పంపిణీ చేశారు. అమెరికా జనాభాలో మొత్తం 35శాతం మందికి (దాదాపు 42శాతం మంది తొలిడోసు, 28శాతం రెండు డోసులు తీసుకున్నారు) పంపిణీ జరిగింది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న చైనాలో ఇప్పటికే 21కోట్ల డోసులను అందించినట్లు సమాచారం. టీకా పంపిణీలో మూడో స్థానంలో ఉన్న భారత్లో ఇప్పటి వరకు 14కోట్ల డోసులను అందించారు. యూరోపియన్ యూనియన్(12కోట్లు), బ్రిటన్(4.5కోట్లు), బ్రెజిల్(4కోట్లు) దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇక దేశ జనాభాలో అత్యధిక మందికి టీకా అందించిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఇప్పటికే అక్కడి జనాభాలో 57శాతం మందికి టీకా పంపిణీ పూర్తిచేసింది.
సవాళ్ల నడుమ కొనసాగుతున్న పంపిణీ..
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. దీంతో వ్యాక్సిన్ పంపిణీపైనే యావత్ ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఈ ప్రక్రియలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ దుష్ర్పభావాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయంతో పాటు పేద, ధనిక దేశాల మధ్య వ్యాక్సిన్ సరఫరాలో అసమానతల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటితో పాటు కొత్తరకం వేరియంట్లు పుట్టుకురావడం అతిపెద్ద సవాల్గా మారింది. అయినప్పటికీ, ఓ వైపు వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూనే మరోవైపు టీకా పంపిణీ ముమ్మరంగా చేపట్టేందుకు ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి.
అనతి కాలంలోనే వ్యాక్సిన్ అభివృద్ధి..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు చేసిన కృషితో స్వల్పకాలంలోనే కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఒక వ్యాక్సిన్ రావడానికి 5 నుంచి 10ఏళ్ల సమయం పడుతుంది. కానీ, శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా కేవలం పది నెలల్లోనే కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా టీకాల పనితీరుపై తాజాగా వస్తోన్న వాస్తవ ఫలితాలు(టీకా ప్రయోగాల ఫలితం కాకుండా) కూడా ఊరట కలిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన టీకాలు 70 నుంచి 95శాతం సమర్థత చూపించడం శాస్త్రవేత్తల విజయంగా అభివర్ణిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్