ఐదు టన్నుల బాంబుని నీళ్లలో పేల్చేశారు..!

రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబును తాజాగా పోలాండ్‌ అధికారులు నీళ్లలో ముంచి పేల్చేశారు. 1945లో నాజీ యుద్ధనౌకపై రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును విసిరిందట. కానీ, అది పేలకుండా......

Updated : 14 Oct 2020 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబును తాజాగా పోలాండ్‌ అధికారులు నీళ్లలో ముంచి పేల్చేశారు. 1945లో నాజీ యుద్ధనౌకపై రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును విసిరిందట. కానీ, అది పేలకుండా కింద పడిపోయింది. స్వినోవిస్యా ప్రాంతంలోని ఓడరేవు వద్ద భూమిలో 12 మీటర్ల లోతులో పాతుకుపోయిన ఐదు టన్నుల బరువున్న బాంబును.. అధికారులు గతేడాది గుర్తించారు. 2.4 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ఈ బాంబుకు ‘టాల్‌ బాయ్‌’ అని పేరు పెట్టారు.

మంగళవారం ఈ బాంబును ‘బాల్టిక్‌ సీ’ సముద్రంలో ముంచి పేలుడు సంభవించకుండా నిర్వీర్యం చేసేందుకు నేవీ అధికారులు ప్రయత్నించారు. కానీ, ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌ చేపట్టకముందే స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి 2.5 కి.మీ దూరంలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. బాంబు పేల్చే క్రమంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి నీరు పెద్దఎత్తున ఎగసి పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని