Wuhan lab: వుహాన్ ల్యాబ్లో ఎవరా ముగ్గురు..?
చైనాలోని వుహాన్ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. దీంతో వైరస్ ఇక్కడి
* శాస్త్రవేత్తల అస్వస్థతపై వాల్స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
ఇంటర్నెట్డెస్క్ : చైనాలోని వుహాన్ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. దీంతో వైరస్ ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికల ఆధారంగా వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురింది. ఇప్పటికే అణుశాస్త్రవేత్తల జర్నల్ ‘బులెటిన్.ఓఆర్జీ’లో కూడా ల్యాబ్ లీకేజీపై కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిల్లో వేటికి చైనా ఆధారాలు చూపించి ఖండించలేదు. కేవలం తమపై దుష్ప్రచారంగానే కొట్టిపారిసింది. ఇప్పుడు తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫాక్ట్ షీట్లోని విషయాలు బయటకు రావడంతో మరోసారి చైనా పాత్రను ప్రశ్నిస్తున్నాయి.
కరోనా వ్యాప్తికి ముందే శాస్త్రవేత్తలకు అస్వస్థత..
బాహ్య ప్రపంచంలో సార్స్కోవ్-2 వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరిందరిలో కొవిడ్19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ వద్దకు ఈ సమాచారం ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది. అత్యంత చాతుర్యంతో చాలా కచ్చితమైన సమాచారం వెల్లడించినట్లు కొందరు అధికారులు వాల్స్ట్రీట్తో పేర్కొన్నారు. కానీ, వారు ఎందుకు జబ్బుపడ్డారో కారణం మాత్రం తెలియలేదని తెలిపారు.
శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టే..
చైనాలోని వుహాన్లో 2019 డిసెంబర్ 8వ తేదీన తొలి సార్స్కోవ్-2 కేసు నమోదైంది. కానీ, చాలా మంది వైరాలజిస్టులు, అంటువ్యాధుల చికిత్స నిపుణులు మాత్రం అది 2019 నవంబర్లోనే వుహాన్లో వ్యాపించి ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనావైరస్లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడంలేదు.
గతేడాది మార్చిలో హడ్సన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ‘‘ లెవల్ 3 ల్యాబ్లో చాలా రక్షణ ఉంటుంది. అక్కడ కరోనా వైరస్లపై పనిచేస్తున్న ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో ఇన్ఫ్లుయెంజా లక్షణాలు ఉన్నాయి. వీరంతా ఒకే వారంలో తీవ్ర అస్వస్థకు గురి కావడం కానీ, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడంగానీ జరిగింది. పరిశోధకులు జబ్బుపడటమే మొదటి క్లస్టర్ కావచ్చు’’ అని పేర్కొన్నారు. పాంపియో గతంలో నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన ఎంత మంది జబ్బుపడ్డారో కూడా అంకెతో సహా చెప్పారు.
అమెరికా తప్పుదోవ పట్టిస్తోంది..
ఈ కథనంపై వాల్స్ట్రీట్ చైనా విదేశాంగ శాఖను వివరణ కోరగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ సమాధానం చెప్పింది. ల్యాబ్ నుంచి లీకయ్యే అవకాశం లేదని పేర్కొంది. అమెరికా ఈ ప్రచారాన్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. గతంలో కూడా చైనా ఈ వైరస్ తమ దేశంలో పుట్టలేదని.. బయట నుంచి వచ్చిందని ప్రచారం చేసింది. ఒక దశలో అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న ఫోర్ట్డెట్రిక్ సైనిక స్థావరంలోని ల్యాబ్ నుంచి వచ్చిందని కూడా ఆరోపించింది.
ఈ ఏడాది జనవరిలో వుహాన్ ల్యాబ్కు వచ్చిన నిపుణుల బృందంతో బ్యాట్ ఉమెన్గా పేరున్న షీఝెంగ్ లీ మాట్లాడుతూ.. ‘ తమ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదని తెలిపారు. తమ సభ్యుల్లో ఇప్పటికీ కరోనావైరస్ యాంటీబాడీలు లేవు’ అని పేర్కొన్నారు. కానీ, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్షీట్ మాత్రం షీ చెప్పిన మాటలు ఎంత వరకు నమ్మశక్యం అనే అంశంపై సందేహాలను వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్షీట్లో చైనా ల్యాబ్ల్లో జరిగిన పలు ప్రమాదాలు, పీఎల్ఏతో కలిసి చేసిన పరిశోధనలను కూడా పేర్కొన్నారు.
నిపుణుల బృందానికి నో..
ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కొవిడ్ కేసుల్లో 92 మంది అక్టోబర్-డిసెంబర్ మొదటి వారం మధ్యలో అస్వస్థకు గురైనట్లు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది. ఇక వుహాన్లోని బ్లడ్బ్యాంక్ నమూనాలు ఇవ్వాలని .. వాటిల్లో 2019 డిసెంబర్ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని పేర్కొంది. కానీ, వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందని తొలుత పేర్కొంది. ఆ తర్వాత ఇచ్చేందుకు అంగీకరించినా.. ఆ నమూనాలు పరిశీలించే అవకాశం ఇప్పటి వరకూ నిపుణులకు కల్పించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?