XBB variant: ఈ వేరియంట్పై ‘వాట్సాప్’ సమాచారం తప్పు.. కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు భారత్లో వెలుగు చూసిన వేళ.. వైరస్ వ్యాప్తి, కట్టడిపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఇదే సమయంలో దేశంలో ప్రమాదకరమైన ఎక్స్బీబీ వేరియంట్ వ్యాపిస్తోందంటూ వాట్పాప్లో చక్కర్లు కొడుతున్న సమాచారం నకిలీదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
దిల్లీ: చైనాతోపాటు ఇతర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోన్న వేళ.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలో విస్తృత వ్యాప్తికి కారణమైన బీఎఫ్.7 వేరియంట్ (Omicron) విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వైరస్పై పర్యవేక్షణ పెంచడంతోపాటు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఇలా కొవిడ్ వ్యాప్తిపై మరోసారి ఆందోళనలు నెలకొన్న సమయంలో.. భారత్లో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్బీబీ వేరియంట్ (XBB Variant) వ్యాపిస్తోందనే వార్తలు వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ, అది తప్పుదోవ పట్టించే సమాచారమని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.
‘ఒమిక్రాన్ (Omicron) ఉపరకమైన ఎక్స్బీబీ వేరియంట్ (XBB Variant) కొత్తగా వెలుగు చూసింది. డెల్టా వేరియంట్ (Delta Variant) కంటే ఐదు రెట్ల ఎక్కువ వ్యాప్తితోపాటు మరణాల రేటు కూడా అధికంగా ఉంటుంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని వల్ల కలిగే లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. దగ్గు, జ్వరం కాకుండా ఇతర లక్షణాలు ఉంటాయి. ఈ విషయాన్ని కుటుంబీకులు, మిత్రులకు తెలియజేయండి’ అంటూ ఓ సమాచారం వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా తిరుగుతోంది. ఈ సమాచారం నకిలీదని, తప్పుదోవపట్టించేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
మరోవైపు ఒమిక్రాన్ (Omicron) కంటే ఎక్స్బీబీ వేరియంట్ ప్రమాదకరమైనది అనడానికి ఎటువంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇదివరకే పేర్కొంది. డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రమాద తీవ్రత ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యూయేషన్ నివేదిక కూడా వెల్లడించింది. ఏదేమైనా ప్రస్తుతం చైనాలో విజృంభణకు బీఎఫ్.7 వేరియంట్ కారణమని ఈఎక్స్బీబీ కాదన్న విషయాన్ని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్