Presidential Election: నామినేషన్ వేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక(Presidential Election)లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీపడుతోన్న యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) సోమవారం నామినేషన్ వేశారు. దిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఈ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అలాగే నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు.
యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి చివరి నిమిషంలో తెరాస మద్దతు ప్రకటించింది. ఈ ఉదయం ఆ మేరకు ప్రకటన చేసింది. కాంగ్రెస్తో కలిసి వెళ్లే విషయం, అభ్యర్థిని ఎంచుకునే విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. చివరకు విపక్షాలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఆమ్ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీలు మాత్రం తమ ప్రతినిధులను పంపలేదు. బీఎస్పీ, బీజేడీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమె వెంట ఉన్నారు. తగినంత సంఖ్యా బలం ఉండటంతో ఆమె గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సిన్హా వెంట విపక్ష అగ్రనేతల కలిసి రావడం.. ఆ పార్టీలు తమ ఐక్యతను చాటే ఎత్తుగడ అని విశ్లేషకులు అంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- Solar Cycle: సూర్యుడి ఉగ్రరూపం! అసలేం జరుగుతోంది..?
- Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!