తైవాన్పై యుద్ధానికి సిద్ధమవుతోన్న చైనా?
తైవాన్పై సైనిక దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలు తరలించినట్లు సమాచారం. డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్సోనిక్ డీఎఫ్-17 క్షిపణుల్ని మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు..............
బీజింగ్: తైవాన్పై సైనిక దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలు తరలించినట్లు సమాచారం. డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్సోనిక్ డీఎఫ్-17 క్షిపణుల్ని మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఫుజియాన్, గ్వాన్డాంగ్లోని రాకెట్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ స్థావరాల్ని సైతం విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పేర్కొంది. తూర్పు, దక్షిణ థియేటర్లలోని క్షిపణి స్థావరాల్ని గత కొన్నేళ్లలో రెండింతలకు పెంచినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తైవాన్పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది. ఇటీవల తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల్ని సైతం పెంచింది. ఇటీవల డ్రాగన్కు చెందిన 40 యుద్ధ విమానాలు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను దాటి వెళ్లాయి.
ఇటీవల గ్వాన్డాంగ్లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు షీ జిన్పింగ్.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపైనే ఉంచాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బలగాల మోహరింపులు, సైనిక స్థావరాల విస్తరణ, జిన్పింగ్ ప్రకటనని బట్టి చూస్తే తైవాన్పై చైనా దాడిచేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్ధం కావాలి..
తైవాన్పై చైనా దాడికి సిద్ధమవుతున్న అంశాన్ని అమెరికా రక్షణ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. చైనా దండయాత్రకు తైవాన్ సిద్ధంగా ఉండాలని శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ సూచించారు. ఇటు భూసరిహద్దులతో పాటు, జలమార్గాల్లోనూ డ్రాగన్ సేనల్ని దీటుగా తిప్పికొట్టే వ్యూహాలతో తైవాన్ సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.
చైనా-అమెరికా మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో డ్రాగన్పై అగ్రరాజ్యం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తైవాన్ విషయంలోనూ చైనా వైఖరిని అమెరికా బహిరంగంగానే తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చైనా దాడికి దిగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా డ్రాగన్ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
తైవాన్పై దాడి చేయడం చైనాకు అంత సులభమైన పనేమీ కాదని ఓబ్రయాన్ అభిప్రాయపడ్డారు. డ్రాగన్ సేనల్ని కదిలించే ముందుకు అమెరికా వైఖరిని కూడా బీజింగ్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా హెచ్చరించారు. ఒకవేళ అమెరికానే కలగజేసుకుంటే చైనా పరిస్థితి ప్రమాదకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. క్షిపణులతో తైవాన్ను అణచివేసే సామర్థ్యం చైనాకు ఉన్నప్పటికీ.. దానికి వల్ల ఒరిగేదేంటని ప్రశ్నించారు.
తైవాన్కు మద్దతుగా ఇటీవల అమెరికా దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తోంది. అలాగే తైవాన్ భారీ స్థాయిలో ఆయుధాలు, డ్రోన్ల వంటి అత్యాధుని సామగ్రిని సైతం సమకూరుస్తోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘గ్రే జోన్ ఆపరేషన్’ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. అంటే నేరుగా యుద్ధానికి దిగకుండా లక్షిత దేశాలపై వీలైనంత మేరకు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తారు. చైనా ఈ వ్యూహాన్నే ఎన్నుకున్నట్లు ఓబ్రయాన్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?