
Updated : 27 Jan 2022 16:26 IST
AP New Districts: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి: బాలకృష్ణ
అమరావతి: వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్సభ కేంద్రం ఒక జిల్లా కావాలని ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని.. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉందన్నారు. రాజకీయ ఉద్దేశాలతో జిల్లాల ఏర్పాటు సరికాదని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ స్పందించారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు.
Tags :