
Updated : 18 Jan 2022 07:31 IST
CM KCR: యూపీలో కేసీఆర్ ప్రచారంపై త్వరలో నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కొద్దిసేపు అయిదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించారు. కేంద్రంలో భాజపా రైతు, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విమర్శించినట్లు తెలిసింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ ఖాయమని పేర్కొన్నట్లు సమాచారం. యూపీలో ఎన్నికల ప్రచారం ఇతర అంశాలపై సీఎం మాట్లాడారు. దీనిపై త్వరలోనే పార్టీ సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రిమండలి సమావేశం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 వరకు తొమ్మిది గంటల పాటు సాగింది.
Tags :