
బావిలో శవాలుగా.. ఇద్దరు పిల్లలు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు
మహిళల్లో ఇద్దరు గర్భిణులు
అందరూ ఒకే ఇంటి కోడళ్లు
రాజస్థాన్లోని జైపుర్లో ఘటన
జైపుర్: రాజస్థాన్లోని జైపుర్ సమీప దూదూ ప్రాంత బావిలో శనివారం తేలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇవి హత్యలా.. ఆత్మహత్యలా అన్నది విచారిస్తున్నారు. చనిపోయిన చిన్నారుల్లో నాలుగేళ్ల బాలుడు హర్షిత్, 20 రోజుల శిశువు ఉన్నట్టు వెల్లడించారు. తోబుట్టువులైన మృతులను కాళీ దేవి (27), మమతా మీనా (23), కమ్లేశ్ మీనా (20)గా గుర్తించారు. వీరిలో మమతా మీనా, కమ్లేశ్ మీనా నిండు గర్భిణులు. వీరి బంధువు హేమరాజ్ మీనా చెప్పిన వివరాల ప్రకారం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి. ముగ్గురికీ పదేళ్ల వయసులోపే పెళ్లిళ్లు కావడం గమనార్హం. జీవితంలో పైకి ఎదగాలన్న లక్ష్యమున్న అక్కాచెల్లెళ్లు ముగ్గురూ ఇంటి నుంచే చదువులు కొనసాగించేవారు. మమత పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ఎంపిక కాగా, కాళీదేవి బీఏ చివరి సంవత్సరం చదువుతోంది. కమ్లేశ్ ఇటీవలే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేయించుకొంది. వీరికి అత్తింట తీవ్రమైన వేధింపులు ఉండేవి. పెద్దగా చదువుకోని భర్తలు రోజూ తాగి వచ్చి హింసించేవారు. పది రోజుల క్రితం దారుణంగా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దీంతో అక్కాచెల్లెళ్లు ముగ్గురూ పుట్టింటికి వచ్చేశారు. ఈ ఒత్తిడితోనే మహిళలు తమ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పలుచోట్ల వెదికిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కోసం తమను వేధించారని మృతురాళ్ల సోదరుడు మహిళల అత్తింటి వారిపై ఫిర్యాదు చేశారు. వీరి భర్తలు నర్సి, గోర్యో, ముకేశ్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
-
Crime News
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Chiranjeevi: నాకూ గోపీచంద్కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్పోర్ట్లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్లో ఆప్కు భంగపాటు
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు