Telangana News: ఆదివారం నుంచి మేడారానికి హెలికాప్టర్‌ సేవలు

పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ సారి కూడా హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో భక్తులను మేడారం చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 16 Feb 2022 13:29 IST

జయశంకర్‌ భూపాలపల్లి: పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ సారి కూడా హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో భక్తులను మేడారం చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండ నుంచి మేడారానికి వెళ్లి రావడానికి ఒకరికి రూ.19,999 ఛార్జీ నిర్ణయించారు. అలాగే  8 నుంచి 10 నిమిషాల జాతర  విహంగ వీక్షణానికి రూ.3,700లుగా నిర్ణయించారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్లను నడపనున్నారు. టికెట్ బుకింగ్‌ కోసం 94003 99999, 98805 05905 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. info@helitaxii.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. హెలికాప్టర్లలో వెళ్లేవారి కోసం హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు వెళ్లేందుకు వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని