Telangana News: కేసీఆర్‌ ప్రధాని కావాలని మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి

మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దర్శించకున్నారు. వనదేవతలను దర్శించుని మొక్కులు

Updated : 18 Feb 2022 12:27 IST

మేడారం: మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దర్శించకున్నారు. వనదేవతలను దర్శించుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని అమ్మవార్లను మొక్కుకున్నట్లు చెప్పారు. గతంలో తాను కోరిన కోర్కెలను అమ్మవార్లు తీర్చాయని ఈ సందర్భంగా మల్లారెడ్డి తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలకు ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్‌ మేడారం జాతరకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని