Medaram 2022: ట్రైబల్ సర్క్యూట్గా మేడారం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీక అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మేడారం పరిసర ప్రాంతాలను
మేడారం: ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీక అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మేడారం పరిసర ప్రాంతాలను ట్రైబల్ సర్క్యూట్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను ఆయన దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూ.45కోట్లతో ములుగులో గిరిజన వర్సిటీ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తిచేస్తామన్నారు.
మరోవైపు జాతరకు భక్తులు పోటెత్తారు. రేపే చివరి రోజు కావడంతో అమ్మవార్ల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. గద్దెల వద్ద తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్