మోహన్‌బాబు సరసన మీనా!

తెలుగు చిత్రసీమలో డైలాంగ్‌ కింగ్‌గా పేరొందిన నటుడు మోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 26 Feb 2021 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు చిత్రసీమలో డైలాగ్‌ కింగ్‌గా పేరొందిన నటుడు మోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక మీనా నటించనుందని సమాచారం. ఇందులో ఆమెది కీలక పాత్ర అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్ మరో కీలక పాత్రలో‌ నటిస్తోంది.

చిత్రానికి మోహన్‌బాబు స్ర్కీన్‌ప్లే అందిస్తుండగా.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక మంచు విష్ణు సతీమణి వెరోనికా తొలిసారిగా మోహన్‌బాబు స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తోంది. మీనా గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లరిమొగుడు’లో మోహన్‌బాబు సరసన నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో మోహన్‌బాబు పైలట్‌ భక్తవత్సలం నాయుడుగా తన సొంతపేరుతోనే నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని