ఒకేరోజు 21 పుచ్చకాయలు తిన్న హీరో ఎవరంటే..!

హిందీ చిత్రం ‘ఢిషూం’ షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ నమ్మలేని సంఘటన...

Updated : 30 Jul 2020 23:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2016లో విడుదలైన హిందీ చిత్రం ‘ఢిషూం’. ఈ చిత్రం విడుదలై బుధవారానికి నాలుగేళ్లయిన సంగతిని చిత్ర కథానాయకుల్లో ఒకరైన వరుణ్‌ ధావన్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ నమ్మలేని సంఘటనను కూడా అతను బయటపెట్టాడు. ఈ సినిమాలో కొంత భాగాన్ని అబుదబీలోని ఎడారిలో చిత్రీకరించాట. అయితే అక్కడి అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని మరో హీరో జాన్‌ అబ్రహాం... వరుసగా పుచ్చకాయలను లాగించడం మొదలు పెట్టాడట. మూడో, నాలుగో అయితే వింతేమీ లేదు కానీ... జాన్‌ ఒక్క రోజులో మొత్తం 21 పుచ్చకాయలను లాగించేశాడని వరుణ్‌ గుర్తుచేసుకున్నాడు.

జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయికగా రూ.45 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి వరుణ్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం వహించటం విశేషం. తను పనిచేసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటని, తన ఇద్దరు సోదరులు తనకు ఎప్పుడూ అండగా ఉంటారని జూనియర్‌ ధావన్‌ అన్నాడు. అంతేకాకుండా మరోసారి తమ బృందం ఒకచోట చేరే సమయం రావచ్చని... ఢిషూం సీక్వెల్‌ వచ్చే అవకాశాన్ని వరుణ్‌ ధావన్‌ సూచనప్రాయంగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని