దమ్మున్న పాత్రలో విజయశాంతి?

తెలుగులో మహేష్‌బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతిదేవిగా నటించి అలరించిన నటి విజయశాంతి. గతంలో ఆమె అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి ఎన్నో చిత్రాల్లో నాయికగా అలరించింది.

Published : 21 Feb 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగులో మహేష్‌బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతిదేవిగా నటించి అలరించారు విజయశాంతి. గతంలో ఆమె అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి ఎన్నో చిత్రాల్లో నాయికగా సందడి చేశారు. ఆ తరువాత ఆమె లేడీ ఒరియెంటెడ్ చిత్రాలైన ‘కర్తవ్యం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’వంటి చిత్రాల్లోనూ నటించిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయం తర్వాత ఆమెను చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ముందుకొచ్చారు. అయితే రాజకీయాల్లో కొన్నసాగుతున్న ఆమె, సినీ జీవితాన్ని కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకొన్నారు.

విజయశాంతి కోసం ప్రతిమా ఫిల్మ్స్ ఓ సరికొత్త పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేసుకుందట. ఇలాంటి కథకి ఆమె అయితేనే సరిపోతారని భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి  అధికారిక సమాచారం బయటకు రాలేదు. సినిమా షూటింగ్‌ అంతా కశ్మీర్‌ ప్రాంతంలోనే చిత్రీకరించనున్నారట. చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాలంటే కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని