క్లైమాక్స్ మార్చి ఉంటే ‘బద్రి’ మరోలా ఉండేది!
‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్ అయితే ఏంటి’.. ‘బద్రి’ అనగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే డైలాగ్ ఇది. అంతగా పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ ఆకట్టుకున్నారు మరి. ‘రేయ్ నందా.. నందా’ అని ప్రకాశ్ రాజ్ వార్నింగ్ ఇస్తే ‘నేను బద్రి’ అంటూ పవన్ ఇచ్చిన పంచ్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్’.. ‘బద్రి’ అనగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే డైలాగ్ ఇది. అంతగా పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ ఆకట్టుకున్నారు ఈ సినిమాతో మరి. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. 2000 ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ‘బద్రి’. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలు చూద్దాం..
విజయ లక్ష్మీ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. నాయిక రేణు దేశాయ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమీషా పటేల్ మరో నాయిక. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో పవన్ స్టైల్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. రమణ గోగుల సంగీతం ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ‘ఐ యామ్ ఇండియన్’, ‘ఏ చికితా’, ‘బంగాళాఖాతంలో నీరంటే’ పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఏదో సందర్భంలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాథ్ మాటలు, పవన్ మ్యానరిజం, రమణ గోగుల పాటలు.. ఇలా అన్నీ అద్భుతంగా నిలిచి బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకున్నాయి.
అలా తెరకెక్కింది..
‘పవన్ కల్యాణ్కి కథ చెప్పినపుడు బాగుంది అన్నారు. కానీ, క్లైమాక్స్ విషయంలో సందేహించారు. నాకు క్లైమాక్స్ నచ్చలేదు.. దాన్ని మార్చి తీసుకొస్తే నువ్వే దర్శకుడు అన్నారు. అంతే కదా అనుకుని రెండు మూడు వెర్షన్లు రాశాను. తొలిసారి రాసిన దాంట్లో ఫైట్లు ఉండవు. అందుకే ఆయనకు నచ్చలేదేమో అనుకుని, తర్వాత వాటిల్లో యాక్షన్ సన్నివేశాలు రాశాను. అది నాకే నచ్చలేదు. దాంతో పాత స్ర్కిప్టుతోనే ఆయన దగ్గరకు మళ్లీ వెళ్లా. ఏంటి పరిస్థితి అని పవన్ అడిగితే.. రాశాను అని ఇంతకు ముందు చెప్పిందే క్లుప్తంగా మరోసారి వివరించాను. నాకు ఫస్ట్ చెప్పింది ఇదే కదా! అని పవన్ అడగ్గానే అప్పుడు మీరు సరిగా విన్నారో లేదో అని చెప్తున్నా అన్నాను. నాకూ ఇదే నచ్చింది. నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను అని చెప్పారు పవన్. అలా ఈ సినిమా వచ్చింది. నేను క్లైమాక్స్ మార్చుంటే మరోలా ఉండేది. నా క్యారెక్టర్ పోయేది’ అంటూ ఓ సందర్భంలో తెలియజేశారు పూరి జగన్నాథ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ